Voter ID: ఇల్లు 1.. ఓట్లు 100.. నివ్వెరపోయిన సిబ్బంది
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ వార్డులో ఒకే ఇంటి నెంబరులో 103 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇంటికి వెళితే 20మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన వారెక్కడ ఉన్నారంటే పనుల కోసం వేరేచోటికి వలస వెళ్లారని సమాధానం ఇవ్వడం సిబ్బందిని నివ్వెరపర్చింది.
క్షేత్రస్థాయిలో జాబితా వడపోతకు శ్రీకారం..
సిరికొండలో ఇంటింటికీ వెళ్లి ఆరాతీస్తున్న తహసీల్దారు వర్ణ, ఆర్ఐ విలాస్
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ వార్డులో ఒకే ఇంటి నెంబరులో 103 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇంటికి వెళితే 20మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన వారెక్కడ ఉన్నారంటే పనుల కోసం వేరేచోటికి వలస వెళ్లారని సమాధానం ఇవ్వడం సిబ్బందిని నివ్వెరపర్చింది.
బీఎల్ఓలకు సవాల్గా..
మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒకరిద్దరు కౌన్సిలర్లు మహారాష్ట్రలోని బంధువులను తీసుకొచ్చి ఓట్లు వేయించి గెలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఒకే ఇంటి నెంబరుతో వందలాది మంది పేర్లను ఓటరు జాబితాలో చేర్పిస్తున్నారని స్పష్టమవుతోంది. పట్టణంలో 2,397 ఇళ్లల్లో 21,837 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం గుర్తించడంతో.. వారిని వెతికి పట్టుకోవడం, నిర్ధారించుకోవడం బీఎల్ఓలకు సవాల్ మారింది.
పాలనాప్రాంగణం, న్యూస్టుడే: ఎన్నికల ఏడాది కావడంతో కీలకమైన ఓటరు జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. తప్పుల్లేని జాబితా తయారు చేసే క్రమంలో ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. రెండు, ఆపై ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగిన ఓటర్లను తొలగించిన అధికారులు.. ఇపుడు ఒకే ఇంటి నెంబరుతో పదులు, వందల సంఖ్యలో ఉండటంతో మరో వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు కలిపి మొత్తం 4,26,096 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో ఏటా పనుల నిమిత్తం వస్తున్న కూలీలు, బంధువులను ఓటరు జాబితాలో చేర్పిస్తున్నారనే వాదన ఉంది. మరోవైపు ఒకే ఓటరు అటు పంచాయతీలో, ఇటు బల్దియాలోనూ పేర్లు నమోదై ఉండటంతో.. జాబితాలో నకిలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆధార్ అనుసంధానంతో అలాంటి ఓటర్లను తేల్చిన అధికార యంత్రాంగం ఏదో ఒకచోట ఓటుహక్కును కలిగి ఉండాలంటూ నోటీసులు జారీచేసింది. మరోవైపు ఒకే ఇంటి నెంబరుతో అనేకమంది ఓటర్లు జాబితాలో ఉన్నారని గ్రహించిన ఎన్నికల సంఘం సవరణ దిశగా ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. బీఎల్ఓలకు ఒక ఇంటి నెంబరులో ఆరు కంటే ఎక్కువమంది ఓటర్లు ఉన్న వివరాలను అందించింది. ఆ జాబితాను పట్టుకుని వారు ఇంటింటికీ తిరుగుతున్నారు. నిజంగా అంతమంది ఉన్నారా? లేదా? అని ఆరా తీస్తున్నారు. తహసీల్దార్లు, ఇతర అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఎదురవుతున్న సమస్యలు..
బోథ్ నియోజకవర్గంలో ఇంటి నెంబరు లేని ఓటర్లు 511మంది ఉండగా.. ఇంటి నెంబరు 1-10 పేరిట 234 మంది, 1-15 పేరిట 252 మంది, 1-18 పేరిట 293 మంది, ఇంటి నెంబరు 1-23 పేరుతో 396మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2-1 ఇంటి నెంబరులో 255మంది ఉన్నట్లు తేలింది. గ్రామాల వారీగా ఇంటి నెంబర్లు ఒకే క్రమంలో ఉండటం కూడా ఆయా ఇంటి నెంబర్లలో వందల మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం చిరునామా ఉన్నచోట ఓటర్లు లేకపోవడం, ఓటర్లు ఉండే చోట ఇంటినెంబర్లు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇంటింటికీ వెళ్లి పరిశీలన
ఒకే ఇంట్లో ఆరు కంటే ఎక్కువమంది ఉన్న ఓటర్ల వివరాలపై క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్నారు. ప్రజలు బీఎల్ఓలకు సరైన వివరాలు చెప్పి సహకరించాలి. మల్టిపుల్ పోర్షన్స్, అపార్ట్మెంట్లలో ఒకే ఇంటి నెంబరుపై వేర్వేరు కుటుంబాలు ఓటర్లుగా నమోదైతే ఫాం-8 నింపి ఇవ్వాలి. ఇది ఓట్లు తొలగించే ప్రక్రియ కాదు.
రాఠోడ్ రమేష్, ఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు