జిల్లా కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ ..
వీధుల్లో, రహదారులపై ఎక్కడపడితే అక్కడ అస్తవ్యస్తంగా మురుగు నీటి ప్రవాహం ఉండకుండా ఆదిలాబాద్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించనున్నారు.
రూ. 225.46 కోట్లతో నిర్మాణం
పట్టణంలో పలు కాలనీల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ ఇలా
ఆదిలాబాద్ పట్టణం, న్యూస్టుడే: వీధుల్లో, రహదారులపై ఎక్కడపడితే అక్కడ అస్తవ్యస్తంగా మురుగు నీటి ప్రవాహం ఉండకుండా ఆదిలాబాద్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్-2 పథకంలో భాగంగా ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ.225.46 కోట్లు మంజూరయ్యాయి.
చుట్టుపక్కల గ్రామాలు విలీనం కావడంతో.. ఆదిలాబాద్ పట్టణ విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పాత పట్టణంలో చాలావరకు డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా.. కొత్త వార్డుల్లో మురుగు కాలువలు లేక పట్టణవాసులు నరకయాతన పడుతున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలేందుకు, దుర్గంధం వ్యాపించేందుకు ఇది కారణమవుతోంది.
అయితే పట్టణమంతా భూగర్భ డ్రైనేజీని నిర్మించనుండటంతో.. దీనికి అడ్డుకట్ట పడనుంది. చిన్న చిన్న వీధులలో కలిపి మొత్తం 260 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. అవసరమున్న ప్రతి చోటా మ్యాన్హోల్స్ను నిర్మిస్తారు.
మూడు చోట్ల శుద్ధి కేంద్రాల ఏర్పాటు
పట్టణంలోని ఇళ్లనుంచి వచ్చే మురుగు నీరు మూడుచోట్ల కలిసేలా ప్రణాళిక రచించారు. ఇందులో ఖానాపూర్ చెరువుతోపాటు చాందా(టి) వాగు, చిలుకూరి లక్ష్మీనగర్ వద్ద ఉన్న భీంసరి వాగుల్లో మురుగు నీటిని పంపించనున్నారు. దీనికోసం ఆ మూడుచోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను(శుద్ధి కేంద్రాలు) నిర్మించనున్నారు. మొదటగా ఇందులోకి వచ్చిన మురుగును శుద్ధి చేసిన తర్వాతే ఆయా వాగుల్లోకి పంపిస్తారు.
భూ సేకరణ సైతం
శుద్ధి కేంద్రాల ఏర్పాటు కోసం అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం అవసరం. ఈ కేంద్రాలు నిర్మించే మూడుచోట్ల స్థలాల కోసం రూ.10 కోట్లు అదనంగా కేటాయించారు. వీటి కోసం తొలుత ప్రభుత్వ స్థలాన్ని సేకరిస్తారు. ఒకవేళ అందుబాటులో ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రయివేటు స్థలాన్ని కొనుగోలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం చేపట్టే ఈ మురుగు కాలువ పనుల్లో యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీస్) భాగస్వామ్యం కింద బల్దియాకు వచ్చే నిధులను ఇందులో కలుపుతారు. ఒకవేళ నిధుల కొరత ఉంటే.. ఆ భాగస్వామ్యనిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విడుదల చేస్తుంది. మొత్తానికి ఆదిలాబాద్కు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మంజూరు కావడం ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు.
పదిహేను రోజుల్లోగా టెండర్లు
ఈ విషయమై పనులు పర్యవేక్షించే ప్రజారోగ్యశాఖ ఏఈ హరిభువన్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. హైదరాబాద్ తరహాలోనే పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. మురుగు నీటితో వచ్చే దుర్గంధం, దుర్వాసనను వంటి సమస్యలుండవని తెలిపారు. కాలుష్యం ప్రబలకుండా ఇళ్లలోంచి వచ్చే మురుగును శుద్ధి చేసేందుకు మూడుచోట్ల ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నామని, పదిహేను రోజుల్లోగా టెండర్లు ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు.
వివరాలు.. (రూ.కోట్లలో)
మొత్తం డ్రైనేజీ నిర్మాణ వ్యయం: 225.46
కేంద్ర భాగస్వామ్యం: 59.20
రాష్ట్ర భాగస్వామ్యం: 111.86
మున్సిపల్ గ్రాంటు: 6.56
యూఎల్బీ భాగస్వామ్యం: 37.48
భూసేకరణ కోసం: 10.00
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం