రైతు బంధువై!
అన్నదాతలకు అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కారు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టింది.
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం : అన్నదాతలకు అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కారు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల మంది రైతులు 17.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం ప్రారంభంలో 4.96 లక్షల మంది రైతులుంటే ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని 5.79 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు ఎకరానికి రూ.5వేల చొప్పున నగదు జమ చేసేందుకు ప్రతి ఏటా రూ.2,145 కోట్లు కేటాయిస్తోంది. రైతు బీమా కోసం ఏటా రూ.125 కోట్ల ప్రీమియాన్ని చెల్లిస్తోంది. రైతులు ఏ కారణంతో చనిపోయినా రూ.5 లక్షలు పరిహారం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా మొత్తంలో రెండు వేల కుటుంబాలకు పైగా పరిహారం అందించారు. రైతుబంధు, రైతు బీమాతో పాటు రైతువేదికల నిర్మాణం, రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, రైతులకు సాగు సలహాలు అందించేందుకు వీలుగా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, మండల వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం, మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేశారు.
సాగు నీటికి ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం సాగు నీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
కొత్త ప్రాజెక్టులు
* పెన్గంగ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం లభించింది. ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగపై రూ.1,596 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించింది. బ్యారేజీ పనులు 85 శాతం పూర్తి కాగా, పంపుహౌజ్ నిర్మాణం, ప్రధాన కాలువ పనులు చివరి దశలో ఉన్నాయి.
* నేరడిగొండ మండలంలో ప్రతిపాదనలో ఉన్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు రూ.794.33 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను రూ.1,658 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్దా నదిపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు పూర్తికి రూ.4,500 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. దీని ద్వారా 1.44 లక్షల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!