పేదలకు ఊరట.. సంక్షేమానికి బాసట
తెలంగాణ ఏర్పాటు అనంతరం నిరుపేదలకు గౌరవ జీవనం అందించే పథకాలు సర్కారు అమలు చేస్తోంది.
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం: తెలంగాణ ఏర్పాటు అనంతరం నిరుపేదలకు గౌరవ జీవనం అందించే పథకాలు సర్కారు అమలు చేస్తోంది. ఇదివరకటి పింఛను మొత్తాలను గణనీయంగా పెంచడంతోపాటు వివిధవర్గాలకు అండగా నిలిచేకొత్త పథకాలను రూపొందించి అమలు చేస్తోంది.
దళితబస్తీ ప్రయోజనమిది..
ఉమ్మడి జిల్లాలో దళితబస్తీ కింద గడిచిన తొమ్మిదేళ్లలో లబ్ధి పొందిన కుటుంబాలు, పంపిణీ చేసిన భూమి, ప్రభుత్వం వెచ్చించిన వ్యయం వివరాలు జిల్లాల వారీగా..
నాడు డ్రైవర్.. నేడు ఓనర్!
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతో సగం జీవితం మరొకరి వద్ద డ్రైవరుగా పనిచేసిన నేను ఇపుడు ట్రాక్టర్ యజమానిగా మారాను. అందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడం మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. గడిచిన తొమ్మిది నెలల్లో రూ.డీజిల్ ఖర్చులు పోనూ రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. సీఎం కేసీఆర్ చలువతో ఇది సాధ్యమైంది.
మద్దెల రాజు, దళితబంధు లబ్ధిదారు, బోథ్
ఆడ బిడ్డలకు అండగా..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండనిస్తోంది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడంతో తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గినట్లయింది. తొలుత రూ.51 వేలతో ఆ తర్వాత రూ.75,116 చెల్లించిన ప్రభుత్వం 2018 మార్చి నుంచి ఆ సాయాన్ని రూ.1,00,116కు పెంచింది. వేలాది మంది 2014 నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందుతూ వస్తున్నారు.
పండుటాకులకు ఎంతో ‘ఆసరా’
రూ.200 ఉన్న వృద్ధాప్య, వితంతు, బీడీ, చేనేత కార్మికుల పింఛను తొలుత రూ.వెయ్యికి పెంచిన సర్కారు 2018 నుంచి మరో వెయ్యి పెంచి రూ.2,016గా చేసింది. దివ్యాంగులకు రూ.500 నుంచి రూ.1,500 ఆతర్వాత రూ.3,016 పెంచింది. వయసును 57 ఏళ్లకు కుదించడంతో వేలాదిమంది మేలు చేకూరింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,62,721 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 1,13,941 మంది వృద్ధాప్య పింఛనుదారులు ఉంటే.. వితంతువులు 1,26,669 మంది ఉన్నారు. అన్ని రకాల పింఛనుదారులకు నెలకు దాదాపు రూ.40 కోట్లకు పైగా సర్కారు చెల్లిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి నగేష్పై కోడ్ ఉల్లంఘన కేసు
[ 19-04-2024]
అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఆ లోక్సభ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. -
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!