సీఎం గారూ.. మా సందేహాలను తీర్చాకే రండి: భాజపా
2018 ఎన్నికల ప్రచారం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా నిర్మల్ జిల్లాకు రావడం హర్షణీయమని, అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఆయన ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు.
లేఖను చూపిస్తున్న నాయకులు
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: 2018 ఎన్నికల ప్రచారం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా నిర్మల్ జిల్లాకు రావడం హర్షణీయమని, అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఆయన ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల్లో ఉన్న పలు సందేహాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్ర మంత్రిగా ఉండాల్సిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కేవలం ఎల్లపెల్లి మంత్రిగా మారారని దుయ్యబట్టారు. ప్రజలకు అందుబాటులో కట్టాల్సిన సమీకృత భవన సముదాయాన్ని దూరంగా, మంత్రి సంబంధీకుల భూములకు దగ్గరగా ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. దళితబంధును సొంత గ్రామంలో తప్ప ఎక్కడా అమలుచేయడం లేదని, పైగా నర్సాపూర్ (జి)లో గతంలో జరిగిన ఓ సభలో దళితమహిళను అవమానించి కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. చెరువులు- కుంటలు- భూములను చెరబట్టి పట్టణాన్ని వర్షం నీటిలో ముంచేస్తున్నారని, పేపర్ లీకేజీలపై చులకనగా మాట్లాడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మల్కు రైలొస్తుందంటూ ఏళ్లుగా జనాలను మోసగిస్తున్నారని, ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుంటూ వారి బాగోగులను విస్మరించారని, కబ్జాలు- కమీషన్లతో అభివృద్ధి ఫలాలను కొందరికే పరిమితం చేశారని ఆరోపించారు. ఈ మేరకు పలు డిమాండ్లతో ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశామని చెప్పారు. సమావేశంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్రెడ్డి, అంజుకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* మంజులాపూర్లో నూతనంగా ఏర్పాటుచేసిన కుమురం భీం విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, పలువురు భాజపా నేతలు పాల్గొని నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్