అభివృద్ధిపై మమకారం.. కావాలి సహకారం..
‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో పని చేస్తోంది.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ విప్ గోవర్ధన్
న్యూస్టుడే, పాలనాప్రాంగణం
జెండాకు సెల్యూట్ చేస్తున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ ఛైర్మన్ జనార్దన్, ఎమ్మెల్యే రామన్న, పాలనాధికారి రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఇతరులు
‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో పని చేస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని శాసనసభ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఆ తర్వాత తెలంగాణ చౌక్లోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయజెండాను ఎగురవేసి.. స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేళ్ల పాలనలో జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, ఎమ్మెల్యే రామన్న, పాలనాధికారి రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, పుర అధ్యక్షుడు ప్రేమేందర్, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు పాలనాధికారి నటరాజ్, శిక్షణ సహాయ పాలనాధికారి ఆకాష్ మహతో, డీఎఫ్ఓ రాజశేఖర్, ఆర్డీవో రాఠోడ్ రమేష్, పురపాలక వైస్ ఛైర్మన్ జహీర్రంజానీ, ఆయాశాఖల అధికారులు, భారాస శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
వ్యవసాయ శాఖ: రాష్ట్రం ఏర్పడిన కొత్తలో జిల్లాలో 4,88,925 ఎకరాలు సాగులో ఉండగా.. ఇపుడు 7,33,875 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు పథకం కింద జిల్లాలో 1,47,161 మంది రైతులకు రూ.2,364 కోట్లు, పంట నష్టపరిహారం కింద రూ.1,81,933 మందికి రూ.85.97 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. రైతు బీమా కింద వివిధ కారణాలతో మరణించిన 3,088 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున వారి నామిని ఖాతాల్లో రూ.14.08 కోట్లు, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు 6,643 మందికి రూ.27 కోట్ల రాయితీ మంజూరు, మరో 30,928మంది రైతులకు రూ.17.22 కోట్లు రాయితీ రూపేణా విత్తనాలు సరఫరా చేశాం.
దళితబంధు : జిల్లాలో 249 మంది దళిత కుటుంబాలకు యూనిట్ల స్థాపనకు రూ.24.65 కోట్లు తొలివిడతలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.
గిరిజన సంక్షేమం: పోస్టు మెట్రిక్, ప్రీమెట్రిక్ కింద 1,01,943 మంది గిరిజన విద్యార్థులకు రూ.41 కోట్ల ఉపకార వేతనాల మంజూరు, గిరి ప్రాంతాల్లో 199 రహదారుల నిర్మాణ పనులకు రూ.253.63 కోట్లు మంజూరు కాగా రూ.80 కోట్లతో 72 పనులు పూర్తయ్యాయి. విద్యా మౌలిక సదుపాయాలకు రూ.22 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.4.32 కోట్లు, 115 గ్రామ పంచాయతీ భవనాలకు రూ.23 కోట్లు, పర్యాటక ప్రాంతాలైన కుంటాల జలపాతం, ఉట్నూరు పోర్టు అభివృద్ధికి రూ.7.73 కోట్లు, నాగోబా ఆలయానికి రూ.6 కోట్లు మంజూరు చేశాం.
సంక్షేమం : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద జిల్లాలో 29,082 మంది లబ్ధిదారులకు రూ.264.18 కోట్ల ఆర్థిక సాయం చెక్కులు ఇచ్చాం. మహిళా శిశుసంక్షేమ శాఖ ద్వారా ఆరోగ్యలక్ష్మి కింద 54,514 మంది పిల్లలు, 12,841 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లా కేంద్రంలో క్రీడా పాఠశాలను స్థాపించడంతో 240 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. జైనథ్ మినీ స్టేడియానికి రూ.3.58 కోట్లు మంజూరు చేశాం.
విద్యా శాఖ మన ఊరు మన బడి కింద 237 పాఠశాలలు ఎంపిక చేసి మౌలిక సదుపాయాల కల్పనపనులు కొనసాగుతున్నాయి. ఆదర్శ పాఠశాలలో బాలికలకు వసతి ఏర్పాటు, కస్తూర్బాల్లో ఇంటర్ విద్యను అందిస్తున్నాం.
మిషన్ భగీరథ : ఈ పథకం కింద జిల్లాలో 1,234 ఆవాసాలకు రూ.337 కోట్లు ఖర్చు చేసి 1,69,270 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి సురక్షిత తాగునీటిని అందిస్తున్నాం. జిల్లాలో 1,106 అంగన్వాడీ కేంద్రాలు, 652 పాఠశాలలు, 101 రైతు వేదికలకూ నల్లా కనెక్షన్లు ఇచ్చి మంచినీటిని సరఫరా చేస్తున్నాం.
ఆసరా పింఛను : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు వంటివారికి జిల్లాలో 71,742 మందికి రూ.18.36 కోట్లు ప్రతి నెల పింఛను రూపంలో అందజేస్తున్నాం.
వైద్య ఆరోగ్య శాఖ : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన 39,565 బాలింతలకు కేసీఆర్ కిట్లు, రూ.32.72 కోట్లు వారి ఖాతాల్లో జమ, రక్తహీనత నివారణకు 7,703 మంది గర్భిణులకు న్యూట్రిషను కిట్లు, కంటి వెలుగు కింద ఇప్పటివరకు 3,34,133 మందికి పరీక్షలు చేసి 72,832 మందికి కళ్లద్దాలు ఇచ్చాం. రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలకు రూ.11.65 కోట్లతో ఎంఆర్ఐ యంత్రం మంజూరు, డయాలసిస్ యూనిట్, సిటీస్కాన్, సెల్కేర్ యూనిటు, స్కానింగ్ యంత్రాలతో సేవలందిస్తున్నాం. సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, సర్జికల్ అంకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి సేవలు అందుబాటులోకి తెచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా