బాల సదనానికి మరో ముగ్గురు బాలికలు
తల్లి మృతి చెందగా, తండ్రి జైలుకు వెళ్లటంతో అనాథలుగా మారిన ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం బాల సదనానికి తరలించి ఆశ్రయం కల్పించారు.
ఎదులాపురం, న్యూస్టుడే : తల్లి మృతి చెందగా, తండ్రి జైలుకు వెళ్లటంతో అనాథలుగా మారిన ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం బాల సదనానికి తరలించి ఆశ్రయం కల్పించారు. పట్టణంలోని బంగారుగూడకు చెందిన రాధ 11 నెలల కిందట కవల ఆడ శిశువులకు జన్మనిచ్చిన అనంతరం మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉండటంతో వారిని పోషించే ఆర్థిక స్థోమత లేకపోవటంతో ఈ కవల శిశువులను తండ్రి గంగాధర్ మధ్య వర్తులతో కలిసి కవల శిశువులను కర్ణాటకలోని రెండు కుటుంబాలకు విక్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి కవలల తండ్రి గంగాధర్తో పాటు నిందితులను రిమాండ్కు తరలించారు. దీంతో ఆ కవల శిశువులను ఇది వరకే శిశు గృహకు తరలించి ఆశ్రయం కల్పించారు. దీంతో అప్పటికే ఉన్న 10, 08, 06 సంవత్సరాల బాలికలు అనాథలుగా మారారు. వారు బంధువుల వద్ద దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు ఆ ముగ్గురు పిల్లలను బాల సదనానికి తరలించి ఆశ్రయం కల్పించారు. అయితే వారు బాల సదనంలో ఉండటానికి ఇష్టపడటం లేదని ఐసీడీఎస్ ఇన్ఛార్జి పీడీ మిల్కా పేర్కొన్నారు. పెద్ద అమ్మాయి ఏ మాత్రం అక్కడ ఉండకుండా మారాం చేయటంతో ఆమెను బంధువులతో పంపించినట్లు పేర్కొన్నారు. మిగతా ఇద్దరికి నచ్చజెప్పి బాల సదనంలోనే ఉంచామన్నారు. పాఠశాలలు తెరిచాక వారిని వసతి గృహాల్లో చేర్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.