కష్టపడ్డారు.. సీటు సాధించారు
లక్ష్యం గొప్పదైతే ఎంతటి కష్టమైనా దాని ముందు నిలవదని నిరూపించారు. పని చేస్తేనే పూట గడిచే కుటుంబాల నుంచి వచ్చి గురుకులంలో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యంతో చదివారు.
న్యూస్టుడే, ఇచ్చోడ : లక్ష్యం గొప్పదైతే ఎంతటి కష్టమైనా దాని ముందు నిలవదని నిరూపించారు. పని చేస్తేనే పూట గడిచే కుటుంబాల నుంచి వచ్చి గురుకులంలో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యంతో చదివారు. ఓ వైపు తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలనే సంకల్పం, తాము ఉన్నత స్థాయిలో నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. నెల రోజుల కిందట నిర్వహించిన అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశపరీక్షలో ప్రతిభ చాటి సీటు సంపాదించారు. వారే ఇచ్చోడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తమకు ఈ అవకాశం వచ్చిందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడతామని పేర్కొంటున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ జ్యోతి, అధ్యాపకులు అభినందించారు.
ఈ చిత్రంలోని విద్యార్థిని పేరు దుర్గం సాయికీర్తి. కుమురం భీం జిల్లాకు చెందిన ఈమె తల్లిదండ్రులు శంకర్, సునీత. తండ్రి కొన్నేళ్ల కిందట మరణించారు. జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ టీఎస్ ఆర్జేసీలో చేశారు. బీఎస్సీ- బీజడ్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. యూనివర్సీటీ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చడంతో ఎంఏ డెవలప్మెంట్ విభాగంలో సీటు సాధించారు. ఉపాధ్యాయుల తోడ్పాటుతోనే అవకాశం సాధించానని, ఉన్నతస్థాయిలో నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
ఈమె పేరు డి.సుప్రజ. మంచిర్యాల జిల్లా. తల్లిదండ్రులు రామకిష్టయ్య, రాగమ్మలు వ్యవసాయం చేస్తారు. సిర్పూర్లోని టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్లో 10వ తరగతి పూర్తి చేశారు. చెన్నూర్లోని టీఎస్ఆర్జేసీలో ఇంటర్ చదివారు. బీఎస్సీ, బీజడ్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. పరీక్షలో ప్రతిభ కనభర్చడంతో అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలో ఎంఏ డెవలప్మెంట్ విభాగంలో సీటు సాధించారు. ఐఏఎస్ సాధించి సమాజానికి సేవలు అందించాలనేదే నా లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ చిత్రంలోని విద్యార్థిని పేరు మల్కల సుప్రియ. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం. తల్లిదండ్రులు రాజేశ్వర్, గంగమ్మలు వ్యవసాయం చేస్తారు. పది, ఇంటర్ జైనథ్లోని మోడల్ స్కూల్, కళాశాలలో చదివారు. ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీజడ్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలో ఎంఏ డెవలప్మెంట్ విభాగంలో సీటు సాధించారు. భవిష్యత్తులో సివిల్స్లో రాణించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈమె పేరు ధనలక్ష్మి. నిర్మల్ జిల్లా. తల్లిదండ్రులు గంగారాం, శాంతాబాయిలు వ్యవసాయం చేస్తారు. పదో తరగతి నిర్మల్లో పూర్తిచేశారు. ఇంటర్ బోథ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, ప్రస్తుతం డిగ్రీ ఇచ్చోడలోని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీజడ్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల నిర్వహించిన అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ప్రతిభ చాటి ఎంఏ డెవలప్ మెంట్ విభాగంలో సీటు సాధించారు. ఆంగ్ల ప్రొఫెసర్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈమె పేరు అశ్విని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. తల్లిదండ్రులు అర్జయ్య, గంగమ్మలు వ్యవసాయం చేస్తారు. 10వ తరగతి, ఇంటర్ వరకు టీఎస్ డబ్ల్యూఆర్ఐఈఎస్ బెల్లంపల్లిలో పూర్తి చేశారు. ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ మూడో సంవత్సరం చదువుతున్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్(హైదరాబాద్)లో సీటు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు