ఇది మా ఆకాంక్షలు.. మీ మీదే ఆశలు
తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన గడ్డకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా స్వాగతం. నిర్మల్ చారిత్రక ప్రాంతమని, కవులు, కళాకారులకు నిలయమని, పోరాటాలకు పురిటిగడ్డ అని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నోసార్లు మీ నోట విన్నాం.
నేడు నిర్మల్కు ముఖ్యమంత్రి కేసీఆర్
నిర్మల్, న్యూస్టుడే : తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన గడ్డకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా స్వాగతం. నిర్మల్ చారిత్రక ప్రాంతమని, కవులు, కళాకారులకు నిలయమని, పోరాటాలకు పురిటిగడ్డ అని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నోసార్లు మీ నోట విన్నాం. 5 జులై 2015న హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని దస్తురాబాద్ మండలం దేవునిగూడెంలో మొక్కలు నాటి సమయానుభావం వల్ల నిర్మల్కు రాకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పటినుంచి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆదివారం నిర్మల్లో సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు అడుగిడుతుండటంతో ఈ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారనే నమ్మకం ఇక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయి దశాబ్దిలోకి అడుగు పెట్టినా అన్ని వనరులు పుష్కలంగా ఉన్న జిల్లాలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రధాన సమస్యలు మీ దృష్టికి తెస్తున్నాం. వీటిపై దృష్టి పెట్టాలని.. నిధులు కేటాయించి పరిష్కరించాలని కోరుకుంటున్నాం.
భూగర్భ మురుగుకాలువకు నిధులు కావాలి
జిల్లాకేంద్రంలో భూగర్భ మురుగుకాలువ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని 2018లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గతంలో ఇందుకోసం సర్వే డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) నివేదికను ప్రభుత్వానికి పంపించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
రైల్వేలైన్ ‘కల’ తీర్చాలని..
రాష్ట్రం- కేంద్రం సంయుక్తంగా కేటాయించి నిధులతో ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గం వస్తుందని, జిల్లావాసుల రైలు కల నెరవేరుతుందని పాలకులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర వాటా చెల్లించే విషయంలో మీరు స్పష్టతనిచ్చి, నిధుల విడుదలకు ఆమోదం తెలిపితే పనులు వేగవంతమయ్యే అవకాశముండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
గల్ఫ్ బాధితులకు బాసటగా నిలవండి
గల్ఫ్లో పనికి వెళ్తున్న కార్మికులు
ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది గల్ఫ్ బాట పడుతున్నారు. 2008లో అప్పటి ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పిస్తామని నిర్మల్లో జాబ్మేళా నిర్వహించింది. ఈ మేళాకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది బాధితులు హాజరయ్యారు. ఈ జాబ్మేళాకు ఆరు కంపెనీలు వచ్చి దరఖాస్తులు స్వీకరించినా ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదు. మీరైనా ఉపాధి చూపించి ఆదుకోవాలని గల్ఫ్ బాధితులు కోరుతున్నారు.
15 ఏళ్లుగా సాగుతున్న పనులు పూర్తి చేయించండి
నిర్మల్ పట్టణం
నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల చొప్పున సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కింద రూ.1,300 కోట్ల వ్యయంతో 2008లో పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత నాలుగేళ్ళలో పూర్తిచేయాలని అప్పటి ప్రభుత్వం గడువు విధించగా, తదనంతరం జరిగిన పరిణామాలతో ఈ పనులు అర్ధాంతరంగా ఆగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2019 లోగా పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు అవకాశం కల్పించారు. గడువు ముగిసి నాలుగేళ్లయినా పనులు గట్టెక్కడం లేదు.
అందరికీ జీవనభృతి అందించాలి
బీడీలు చుడుతున్న కార్మికులు
ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా.. 65 వేల మంది నిర్మల్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. పీఎఫ్ ఉన్న కార్మికులకు మాత్రమే జీవనభృతి వర్తిస్తుందని చెప్పడంతో మిగతా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పీఎఫ్ సౌకర్యం లేనివారు 40 వేల మంది ఉన్నారు. బీడీ యాజమాన్యాలు తమ స్వలాభం కోసం పథకం ప్రకారం బీడీ కార్మికులకు భవిష్యనిధి కల్పించలేదన్న ఆరోపణలున్నాయి. వారికి న్యాయం చేయండి.
పర్యాటకంపై దృష్టి సారిస్తే బాగు
పురాతన శ్యాంగడ్
నిర్మల్ చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం.. 400 ఏళ్ల క్రితం ఏర్పడిన పట్టణంలో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు. జిల్లాకు ముఖద్వారంలో పురాతన సోన్గడ్ ఉంది. నిర్మల్ పట్టణంలో శ్యాంగడ్, బత్తీస్గడ్, ఖిల్లాగుట్ట, బంగల్ బురుజు వంటి పునాతన కట్టడాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పేరున్న నిర్మల్ బొమ్మల కేంద్రం ఉంది. సమీపంలో కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవ్వాల్ అభయారణ్యం, ఎస్సారెస్పీ, కడెం జలాశయాలున్నాయి. బాసర చదువుల తల్లి క్షేత్రం, పురాతన కదిలి పాపహరేశ్వర, అడెల్లి మహా పోచమ్మ దేవస్థానాలు ఉన్నాయి. నిర్మల్ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
సదర్మాట్ బ్యారేజీ పూర్తి చేయాలని..
నిర్మాణంలోనే సదర్మాట్ బ్యారేజీ
మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరి నదిపై ఏడేళ్ల క్రితం నిర్మాణ పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. చెరువుల కింద ఉన్న కాలువలో పాటు స్వర్ణ, గడ్డెన్నవాగు జలాశయాలు, సరస్వతి కాలువల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 41 ఎత్తిపోతల్లో 29 పథకాలకు మరమ్మతులు చేయలేక దాదాపు 15 వేల ఎకరాలకుపైగా భూములు బీళ్లుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత