రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది: మంత్రి
ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలతో సాగుచేసి ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న రైతాంగం కళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనందం కనిపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
నిర్మల్ మండలం కొండాపూర్ నుంచి ఎల్లపెల్లి రైతువేదిక వరకు ఎడ్లబండి నడిపిస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్
నిర్మల్-నిర్మల్ గ్రామీణం, న్యూస్టుడే : ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలతో సాగుచేసి ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న రైతాంగం కళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనందం కనిపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని మార్కెట్యార్డు, మండలంలోని ఎల్లపెల్లి రైతు వేదిక (న్యూపోచంపాడ్)లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాట్లాడారు. అంతకుముందు ఈ రెండు చోట్ల కాసేపు ఎడ్లబండి, ట్రాక్టర్ను నడిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కావడం, అన్నదాతలు పడుతున్న బాధలు తెలియడంతోనే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ చేపడ్తున్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగి ఆయకట్టు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వాగులు, నదులపై చెక్డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు పుష్కలంగా వృద్ధి చెందడంతో రెండు పంటలు సాగవుతున్నాయన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను సకాలంలో కొనుగోలు చేస్తున్నామన్నారు. యాసంగి సీజన్ను మార్చి 31 వరకు ముగిస్తే తర్వాత కురిసే అకాల వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వచ్చే సీజన్ నుంచి ముందస్తు పంటలు సాగు చేయాలని సూచించారు. కష్టపడే కర్షకునికి అన్ని విధాలుగా అండగా ఉండటంతో రైతు ఆత్మహత్యలు లేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతచారి వంటి దాదాపు 1200 మందికిపైగా అమరులు అయ్యారని గుర్తుచేశారు. అంతకుముందు వ్యవసాయ అధికారులు రైతు దినోత్సవ నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, ఆత్మ ఛైర్మన్ గంగారెడ్డి, జడ్పీ సీఈఓ సుధీర్, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, నాయకులు అల్లోల గోవర్ధన్రెడ్డి, గంగాధర్, మల్లేశ్, వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, పలు గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
రూ.కోట్లలో అక్రమాలు.. కానరాని చర్యలు
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు