అధికారే అన్నీ.. సిబ్బంది లేక ఇబ్బంది
జిల్లాలోని కొన్ని శాఖల్లో జిల్లాస్థాయి అధికారి తప్ప వారి విభాగాలకు కనీసం అటెండర్ కూడా లేరు.దీంతో వారి కార్యాలయాలకు అన్నీ తామై వ్యవహరిస్తూ అవస్థలు పడుతూ నెట్టుకొస్తున్నారు. జిల్లాలో యువజన, క్రీడాభివృద్ధిశాఖ,
నిరాదరణకు గురవుతున్న శాఖలు..
జిల్లాస్థాయి అధికారులు (డీవైఎస్ఓ, వయోజన విద్యాధికారి) అందుబాటులో ఉండేది ఈ గదిలోనే
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే : జిల్లాలోని కొన్ని శాఖల్లో జిల్లాస్థాయి అధికారి తప్ప వారి విభాగాలకు కనీసం అటెండర్ కూడా లేరు.దీంతో వారి కార్యాలయాలకు అన్నీ తామై వ్యవహరిస్తూ అవస్థలు పడుతూ నెట్టుకొస్తున్నారు. జిల్లాలో యువజన, క్రీడాభివృద్ధిశాఖ, జిల్లా ఔషధ తనిఖీ(డీఐ) శాఖలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డీఐ కార్యాలయం ఓ అద్దె నివాసంలో కొనసాగుతుండగా.. డీవైఎస్ఓ కార్యాలయం ఇక్కడి సైన్స్ సెంటర్ భవనంలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికి జిల్లాస్థాయి అధికారులు తప్ప అసిస్టెంట్, అటెండర్ వంటి వారు ఎవరూ లేకపోవడంతో కార్యాలయం తెరిచిన దగ్గర నుంచి శుభ్రం చేయించడం, కార్యాలయ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం వరకు అన్ని వారే చూసుకుంటున్నారు. విధినిర్వహణలో ఇతర ప్రాంతాల్లో పర్యటించినా కార్యాలయాలకు తాళం వేసి వెళ్లాల్సిన దుస్థితి ఆ శాఖల జిల్లా అధికారులది. చాలామందికి క్రీడలు, ఔషధాల శాఖలు ఎక్కడున్నాయో తెలియదు. కనీసం ఒక ఆఫీస్అసిస్టెంట్, అటెండర్ను నియామకం చేసినా ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడకుండా, శాఖకు సంబంధించిన సమాచారం బయటి డీటీపీ కేంద్రాలకు వెళ్లకుండా ఉంటాయి.
* జిల్లా యువజన, క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయం ఇది. బోర్డుపై పేరు మరోలా ఉందని అనుకుంటున్నారా.. కానీ ఇందులోనే సంబంధిత శాఖ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రతి సందర్భంలోనూ ఆటలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ గొప్పలు చెప్పడం తప్ప సంబంధిత శాఖకు కనీసం అటెండర్ను కూడా ఇవ్వలేకపోతున్నారు. జిల్లా అధికారికి సహాయకుల సంగతి పక్కన పెడితే ఇక్కడి క్రీడాకారుల శిక్షణకు ఈ శాఖ తరఫున ఒక్క శిక్షకుడుకూడా లేకపోవడం గమనార్హం. వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల సహకారాలతో ఈ శాఖ నిర్వహణ సాగుతుండటం విశేషం.
* ఇక్కడ సూచిక కూడా సక్రమంగా కనిపించకుండా ఓ నివాసంలో కొనసాగుతున్న కార్యాలయం.. జిల్లా ఔషధ తనిఖీ అధికారిది. ఈ శాఖ పరిధిలో వందల సంఖ్యలో ఔషధ దుకాణాలు, ల్యాబ్లు, రక్తనిధి కేంద్రాలు ఉంటాయి. వీటిని నిత్యం తనిఖీ చేస్తూ నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారికి ఉంటుంది. దుకాణాలకు నూతనంగా అనుమతులు ఇవ్వడం, తనిఖీల్లో భాగంగా నోటీసులు జారీ చేయడం ఇలా అనేక పనులు ఉంటాయి. ఇవన్నీ చేసేందుకు జిల్లా అధికారి తప్ప మరొక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది. తనిఖీలకు వెళ్తే కార్యాలయానికి తాళం వేయాల్సిందే. పని నిమిత్తం దుకాణదారులు ఇక్కడికి వచ్చినా నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు విద్యార్థిని ఎంపిక
[ 24-04-2024]
జిల్లా కేంద్రం బంగారిగూడలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని జేబా అమ్రిన్ ఎస్.జి.ఎఫ్. అండర్-17 ఏళ్ల విభాగంలో జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. -
క్రీడా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 24-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పల్లెల్లో ప్లాట్లు.. కొన్నవారికి పాట్లు
[ 24-04-2024]
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. ‘రియల్’ దందా చేసే వ్యక్తులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని 396 పంచాయతీల్లో అధికారులు గుర్తించిన లేఅవుట్లు 419 ఉండగా.. ఇందులో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అనుమతులున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. -
ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే
[ 24-04-2024]
గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రక్షణ తీగలే.. యమపాశాలు
[ 24-04-2024]
రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. -
తునికాకు సేకరణకు వేళాయె..
[ 24-04-2024]
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు -
అక్రమ దందా.. అధికారుల అండ
[ 24-04-2024]
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
[ 24-04-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారామ్, -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..