అంతర్రాష్ట్ర రహదారి.. ప్రమాదకారి
ఘన్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై కన్గుట్ట గ్రామ సమీపంలోని వంతెన వద్ద, సాకెర గ్రామ సమీపంలో భారీ గుంతలు పడటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
పదుల సంఖ్యలో ఘటనలు
బోథ్, న్యూస్టుడే
ఘన్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై కన్గుట్ట గ్రామ సమీపంలోని వంతెన వద్ద, సాకెర గ్రామ సమీపంలో భారీ గుంతలు పడటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
రహదారులు నిర్మించడంతో గ్రామాలు, పల్లెలు అభివృద్ధి చెందటం చూస్తుంటాం. కానీ అదే ప్రమాదాలకు నెలవుగా మారి ప్రజల పాలిట ప్రమాదకారిగా మారుతోంది. ఇక్కడ నెల రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ-మహారాష్ట్రలను కలుపుతూ బోథ్ మండలంలోని సరిహద్దు గ్రామాలమీదుగా పొచ్చర ఎక్స్రోడ్డు నుంచి ఘన్పూర్ వరకు రోడ్డును నిర్మించారు. బోథ్ మండలంలోని పొచ్చర, కన్గుట్ట, కౌఠ, సాకెర, సొనాల, గుట్టపక్కతండా, ఘన్పూర్ మీదుగా అంతర్రాష్ట్ర చెక్పోస్టు వరకు దాదాపు 16 కి.మీ దూరంతో రహదారిని నిర్మించారు. ప్రస్తుతం ఈ మార్గం పొడవునా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కన్గుట్ట వంతెన వద్ద రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించబోయి వాహనదారులు ఎదురుగా వస్తున్న వాటిని గమనించకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతోపాటు గుంతలను తప్పించబోయి అదుపుతప్పి పడిపోతున్నారు. మహారాష్ట్ర ప్రాంతం దగ్గరగా ఉండటంతో.. ఘన్పూర్వైపునుంచి అక్కడివారు నిత్యం ఆయా పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. సొనాల పరిసర ప్రాంతంలోని ఓ కూడలి వద్ద ఉన్న హోటల్లో, పొచ్చర ఎక్స్రోడ్డు వద్ద ఉన్న ధాబాలలో మద్యం తాగడం. తాగి వాహనాలను నడుపుతుండటంతో.. ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే..
* సొనాల గ్రామానికి చెందిన ఒకరు సాయంత్రం నడకకు వెళ్లగా.. వెనక నుంచి వచ్చిన మహారాష్ట్రకు చెందిన ద్విచక్ర వాహనదారుడు అతన్ని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారుడు అధికంగా మద్యం తాగి ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
* కన్గుట్ట వంతెన వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై పొచ్చర నుంచి కౌఠకు వెళుతున్న ఓ కారు గుంతలను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో ఇదే వంతెన వద్ద రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గుంతలను గమనించకపోవటంతో అదుపుతప్పి పడి తీవ్ర గాయాలపాలయ్యారు.
* కన్గుట్ట గ్రామ సమీపంలో పొచ్చర వైపు వెళుతున్న ట్రాక్టరును గమనించక వెనుకే వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు బలంగా ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
* కౌఠ గ్రామ సమీపంలో కౌఠ నుంచి మద్యం తాగి వెళుతున్న ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొన్నాడు. దీంతో ఆటోలోని వారు, వాహనదారుడు గాయాలపాలయ్యారు.
* సొనాల గ్రామ సమీపంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద సైతం ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పిపడిపోతున్నారు. ఇటీవల ఇద్దరు గాయాలపాలయ్యారు.
* సాకెర గ్రామ సమీపంలో రహదారి మధ్యలో గుంత ఏర్పడటంతో.. దాన్ని తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది.
గుంతలు పూడ్చుతాం
ఘన్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గుంతలను త్వరలోనే పూడ్చుతాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. వంతెనల వద్ద, మూలములుపుల వద్ద జాగ్రత్తలు చేపడతాం.
సునీల్, డీఈ, ఆర్అండ్బీ
తనిఖీలు చేపడతాం
ఘన్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి గల కారణాలు తెలుసుకొని ప్రమాదాలను నివారిస్తాం. రహదారిపై ఉన్న హోటళ్లు, ధాబాలు, చిన్నచిన్న వ్యాపార సముదాయాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి రాలేదు. తనిఖీలు చేస్తాం, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రతి రోజు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం.
కేంద్రె రవీందర్, ఎస్సై
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ