ఆశలు రేకెత్తిస్తున్న ఇంజినీరింగ్ కళాశాల
‘మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరిక మేరకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో. దాన్ని పరిశీలిస్తాం.’ అని నిర్మల్లో ఆదివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది.
అనువైన ప్రాంతం కోసం అన్వేషణ..
ఈటీవీ, ఆదిలాబాద్
‘మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరిక మేరకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో. దాన్ని పరిశీలిస్తాం.’ అని నిర్మల్లో ఆదివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది.
అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాంకేతిక ఉన్నత విద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం పెద్దలోటుగా ఉంది. ముఖ్యమంత్రి ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై హామీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటివరకు బాసర కేంద్రంగా ఆర్జీయూకేటీ ఉన్నప్పటికీ ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకే అవకాశం ఉంటుంది. గతంలో ఆదిలాబాద్లో బాపూజీ ఇంజినీరింగ్ కళాశాల, నిర్మల్లో మహేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల, మంచిర్యాలలో ఐజా పేరిట ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండేవి. కానీ 2004 నుంచి 2010 మధ్యకాలంలో విద్యార్థులు హైదరాబాద్లోని కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాపై ప్రభావం పడింది. అదేసమయంలో కళాశాలల నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించడం, ప్రభుత్వం నుంచి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్లో జాప్యం జరగడంతో కళాశాలల మూసివేతకే ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయించడంతో.. ఇంజినీరింగ్ విద్య అందుబాటులో లేకుండా పోయింది. తాజాగా సీఎం హామీతో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైతే సాంకేతిక ఉన్నత విద్య జిల్లాలో అందుబాటులోకి వచ్చినట్లవుతుందనే అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది.
కావాల్సినవి..
ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలంటే ప్రైవేటులోనైతే కనీసం 20 ఎకరాలు స్థలం, నిపుణులైన బోధకులను తప్పనిసరిగా యాజమాన్యమే చూపించాల్సి ఉంది. ప్రభుత్వ కళాశాల అయితే అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. పైగా భవిష్యత్తు విద్యావసరాల రీత్యా కనీసం 30-50 ఎకరాల్లో కళాశాల ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల/నిర్మల్కు అనుగుణంగానే ఆదిలాబాద్, ఆసిఫాబాద్కు సైతం నాలుగు వరుసల రహదారులు అనుసంధానమై ఉండటంతో రాకపోకలకు ఏ ఇబ్బందీ లేదు. ఇప్పటికే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో అసంతృప్తి ఉంది. ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పరంగా మేలుచేసినట్లేననే మాట రాజకీయనేతల నుంచి వినిపిస్తోంది. ఈ నెల 26 నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం కానుండటం, సీఎం హామీ ఇవ్వడంతో సానుకూల స్పందన లభిస్తోంది. ఉమ్మడి జిల్లా నేతలు పట్టుదల, పంథాలకు వెళ్లకుండా సామరస్యంగా కనీసం తాత్కాలికమైన ఏర్పాట్లు చేసినా ఈ ఏడాదిలోనే కళాశాల అందుబాటులోకి తీసుకురావడం కష్టమేమీ కాదనే అభిప్రాయం పేరు వెల్లడించడానికి ఇష్టపడని హైదరాబాద్లోని సాంకేతిక ఉన్నత విద్యాశాఖాధికారి ఒకరు ‘ఈనాడు’తో పేర్కొనడం గమనార్హం.
ప్రయోజనం..
ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైతే సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్సైన్స్/మెకానికల్ ఇంజినీరింగ్/ ఈఈఈ/ఈసీఈ లాంటి ఎనిమిది విభాగాలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో కోర్సుకు 30 విద్యార్థులు తగ్గకుండా చూస్తారు. విద్యార్థుల సంఖ్య వంద దాటితే మరో సెక్షన్ ఏర్పాటవుతుంది. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం.. ప్రతి విభాగానికి ఓ ప్రొఫెసర్, మరో ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, అయిదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తారు. అంటే వంద వరకు బోధన సిబ్బంది ఉంటే కనీసం మరో రెండు వందల మంది బోధనేతర సిబ్బందికి ఉద్యోగాలు వస్తాయి. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే ఆర్జీయూకేటీ ఉన్నందు నిర్మల్ మినహా మిగిలిన మూడు జిల్లా నేతల్లో స్థలాన్వేషణ ప్రారంభమైనట్లు సూచనప్రాయంగా తెలియవచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శి బదిలీ
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా 32 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు
[ 23-04-2024]
ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. -
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ