సర్కారు స్థలం.. ప్రైవేటు పరం..
అది ప్రభుత్వ భూమి. ఆ స్థలంలో ఓ క్వార్టర్ నిర్మించి ఉంది. గతంలో నీటి పారుదలశాఖ ఫీల్డ్ అధికారి కార్యాలయంగా ఉండేది. క్వార్టర్తోపాటు ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు.
నీటిపారుదల క్వార్టర్లో మద్యం దుకాణం
ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణం..
మందు బాబుల కోసం క్వార్టర్ వెనకాల వేసిన రేకుల షెడ్డు
సారంగాపూర్, న్యూస్టుడే : అది ప్రభుత్వ భూమి. ఆ స్థలంలో ఓ క్వార్టర్ నిర్మించి ఉంది. గతంలో నీటి పారుదలశాఖ ఫీల్డ్ అధికారి కార్యాలయంగా ఉండేది. క్వార్టర్తోపాటు ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. క్వార్టర్లో మద్యం గొలుసు దుకాణం ఏర్పాటు చేసి ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. ఇదంత ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. సారంగాపూర్ మండలంలోని నిర్మల్-స్వర్ణ రహదారిని ఆనుకొని జామ్ గ్రామంలో బహిరంగంగా జరుగుతున్న ఆక్రమణ.. స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడ భూసేకరణ చేసి ఫీల్డ్ ఆఫీస్ను నిర్మించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక కార్యాలయంలోపాటు ఖాళీ స్థలం వృథాగా ఉండిపోయింది. ఇప్పటికీ ‘ఫీల్డ్ ఆఫీస్ స్వర్ణ కాలువ క్వార్టర్’ పేరున 4వ బ్లాకులో ఇంటి నెం 4-1తో గ్రామ పంచాయతీ రికార్డుల్లో వివరాలు నమోదై ఉన్నాయి. దీనిపై కన్నేసిన కొందరు స్థలాన్ని కబ్జా చేశారు. క్వార్టర్లో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దాని వెనకాల రేకుల షెడ్డు వేసి తాగేందుకు అడ్డాగా మార్చారు. ముందున్న ఖాళీ స్థలంలో దుకాణ సముదాయం కోసం శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. ఏడాది క్రితం ‘ప్రభుత్వ భూమిలో.. పరుల పాగా’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన నీటి పారుదలశాఖ అధికారులు నిర్మాణాలను నిలిపివేయించారు. ఇటీవల తిరిగి శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభమై కొనసాగుతున్నాయి.
ఫీల్డ్ అధికారి కార్యాలయ క్వార్టర్
స్పందించని పంచాయతీ కార్యదర్శి..
ఇక్కడ చేపడుతున్న శాశ్వత నిర్మాణ పనులను నిలిపేయాలని కోరుతూ ఏప్రిల్ 19న స్వర్ణ ప్రాజెక్టు జేఈ మధుపాల్ సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయం, జామ్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి రాత పూర్వంగా లేఖ రాసి స్వయంగా అందజేసినట్లు తెలిపారు. భూమి ఆక్రమణ యాక్టు 1905 ప్రకారం కబ్జాదారులపై నేరుగా చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని, గ్రామ కంఠం పరిధిలో ఉన్నందున ఆక్రమణ దారులకు నోటీసులిచ్చి నిర్మాణాలను కూల్చాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 43 రోజులు కావస్తున్నా స్థానిక పంచాయతీ కార్యదర్శి కబ్జాదారులకు నోటీసు ఇవ్వలేదని జేఈ తెలిపారు. దీనిపై ఆయన స్పందించక పోవడంతో శాశ్వత నిర్మాణాల పనులు జోరుగా కొనసాగుతూ చివరి దశకు చేరుకున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేస్తామని జేఈ తెలిపారు.
చివరి దశకు చేరిన శాశ్వత నిర్మాణ పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి