logo

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం : ప్రకాశ్‌ అంబేడ్కర్‌

బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు.

Published : 07 Jun 2023 03:39 IST

ప్రకాశ్‌ అంబేడ్కర్‌కు స్వాగతం పలుకుతున్న దళిత సంఘాల నాయకులు

శాంతినగర్‌, న్యూస్‌టుడే : బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన వ్యాఖ్యనించారు. ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ఆర్‌పీఐ జిల్లా అధ్యక్షుడు సందీప్‌ దాండిగే అధ్యక్షత వహించారు. ఆర్‌పీఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్‌, ఆదిలాబాద్‌ తాలూకా అధ్యక్షుడు పంచషీల్‌ గోవే, దళిత సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రజ్ఞ, దుర్గం శేఖర్‌, మాల సంఘం అధ్యక్షుడు భూమన్న, తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్‌, పరదాన్‌ ఆదివాసీ సమాజ్‌ నాయకుడు దుర్వ నగేష్‌, మైనార్టీ నాయకులు యూనిస్‌ అక్బాని, నేతకాని సంఘం దీపక్‌ కుమార్‌, మాలీసంఘం నాయకుడు సుకుమార్‌ పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని