సేవలు భేష్.. గుర్తించిన ఎన్కాస్
ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోని ఆసుపత్రులను జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 11 పీహెచ్సీ/యూపీహెచ్సీలు ఎన్కాస్ గుర్తింపు పొందగా తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని పుత్లీబౌలి పట్టణ పీహెచ్సీకి ఎన్కాస్, ఉట్నూర్, కుమురం భీం జిల్లా ఆసుపత్రుల్లోని లేబర్రూం(ప్రసవ విభాగా)లకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది.
ఉట్నూర్, ఆసిఫాబాద్ లేబర్రూంలకు ‘లక్ష్య’, పుత్లిబౌలీ పట్టణ పీహెచ్సీకి పురస్కారం
ఆదిలాబాద్ జిల్లాలో అన్ని యూపీహెచ్సీలకు వర్తింపు
ఆసిఫాబాద్ ఆసుపత్రిలో లేబర్రూంను పరిశీలించటానికి మే 1న వచ్చిన ఎన్కాస్ బృందంతో ఆసుపత్రి సిబ్బంది
న్యూస్టుడే, ఆదిలాబాద్ వైద్య విభాగం: ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోని ఆసుపత్రులను జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 11 పీహెచ్సీ/యూపీహెచ్సీలు ఎన్కాస్ గుర్తింపు పొందగా తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని పుత్లీబౌలి పట్టణ పీహెచ్సీకి ఎన్కాస్, ఉట్నూర్, కుమురం భీం జిల్లా ఆసుపత్రుల్లోని లేబర్రూం(ప్రసవ విభాగా)లకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది. ఆ కేంద్రాల్లో జాతీయస్థాయి ప్రమాణాల మేరకు వైద్య సేవలందిస్తున్నందుకు ఈ పురస్కారాలను ‘జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ’ ప్రకటించింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఎన్కాస్(నాణ్యతా ప్రమాణాల గుర్తింపు) బృందం పర్యటించి ఆయా కేంద్రాలను పరిశీలించి కేంద్రానికి సమర్పించిన నివేదిక మేరకు వాటికి జాతీయ స్థాయి గుర్తింపు పురస్కారాలను ప్రకటించారు.
ఇప్పటికే బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, దంతన్పల్లి, భీంపూర్ పీహెచ్సీలు రెండేసి సార్లు ఎన్కాస్ గుర్తింపు లభించింది. గుడిహత్నూర్, అంకోలి, గాదిగూడ, ఖుర్శిద్నగర్, హమాలీవాడ, శాంతినగర్ పట్టణ పీహెచ్సీలకు సైతం ఎన్కాస్ గుర్తింపు లభించింది. రిమ్స్, ఉట్నూర్ పిల్లల వార్డులు సైతం ఇటీవలే ముస్కాన్ గుర్తింపు పొందాయి. తాజాగా పుత్లీబౌలి పట్టణ పీహెచ్సీ ఎన్కాస్ గుర్తింపు లభించటంతో ఎన్కాస్ గుర్తింపు లభించిన వంద శాతం పట్టణ పీహెచ్సీల్లో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయి గుర్తింపు పొందటానికి జిల్లా క్వాలిటీ మెంటరింగ్ టీం, క్వాలిటీ మేనేజర్లు సాయిప్రసాద్, అమర్లు విశేష కృషి చేస్తున్నారు.
సిబ్బందికి 25 శాతం ప్రోత్సాహకం
జాతీయస్థాయి గుర్తింపు ద్వారా అందనున్న నగదులో సిబ్బందికి 25 శాతం నిధులను ప్రోత్సాహకంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 75 శాతం ఆయా కేంద్రాల్లో అత్యవసర పనులకు వినియోగించుకొని బాధితులకు మెరుగైన సేవలందించటానికి నిబంధనలు ఉన్నాయి. దీంతో మరింత మెరుగైన సేవలు అందే అవకాశాలున్నాయి.
ప్రతి కేంద్రానికి రూ.3 లక్షల ప్రోత్సాహక నగదు
ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రసవ విభాగాలకు ‘లక్ష్య’ కింద, ఆదిలాబాద్ పుత్లీబౌలి పట్టణ పీహెచ్సీకి ఎన్కాస్కు ఎంపిక కావటంతో ఒక్కో విభాగానికి రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందనుంది. ఇలా మూడేళ్లపాటు మొత్తం రూ.9 లక్షలు అందనున్నాయి. అనంతరం మళ్లీ పరిశీలన చేస్తారు.
ఇది ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిలోని లేబర్రూం(ప్రసవ విభాగం). ఇందులో జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు కాన్పులు చేస్తున్నారు. మే 19, 20 తేదీల్లో ఉట్నూర్ ఆసుపత్రి, మే 1న ఆసిఫాబాద్ ఆసుపత్రిలోని లేబర్రూంలను ఎన్కాస్ బృందం ఈ విభాగాలను పరిశీలించి అక్కడ పాటిస్తున్న జాతీయ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించింది. కాన్పుల సమయంలో అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలను నమోదు చేసి నివేదికను కేంద్రానికి పంపించింది. ఉట్నూర్కు 90 శాతం, ఆసిఫాబాద్కు 86 శాతం మార్కులు లభించటంతో ‘లక్ష్య’ పథకంలో భాగంగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది.
ఇది ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లీబౌలి పట్టణ పీహెచ్సీ. మే 10, 11 తేదీల్లో ఎన్కాస్ బృందం పరిశీలించింది. గర్భిణుల నమోదు, టీకాల నిర్వహణ, కేంద్రంలో పారిశుద్ధ్యం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 87 శాతం మార్కులు కేటాయించింది. దీంతో జాతీయ స్థాయిలో ఎన్కాస్ గుర్తింపు లభించింది. దీంతో పట్టణంలోని నాలుగు పీహెచ్సీలకు ఈ గుర్తింపు లభించినట్లయింది.
మరింత మెరుగైన సేవలందిస్తాం
రాఠోడ్ నరేందర్, డీఎంహెచ్ఓ
ఎన్కాస్ గుర్తింపు లభించటం సంతోషంగా ఉంది. దీంతో మా బాధ్యత మరింత పెరిగింది. పీహెచ్సీల్లో మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన సేవలందించటానికి కృషి చేస్తాం. జిల్లాలోని అన్ని పీహెచ్సీలను జాతీయ ప్రమాణాల గుర్తింపు కోసం ప్రమాణాలతో కూడిన సేవలందించే ఏర్పాట్లు చేస్తూ రాష్ట్రంలోనే వైద్య సేవల్లో ఉత్తమ జిల్లాగా ఉండేలా పాటుపడతాం. మా సిబ్బంది జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు వైద్య సేవలందిస్తూ ఎనలేని కృషి చేయటం వల్లనే ఈ స్థాయి గుర్తింపు లభించింది. మా వైద్య బృందానికి అభినందనలు తెలుపుతున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM