రక్షణ వ్యవస్థలో మనమే ముందున్నాం
ప్రజా రక్షణ వ్యవస్థలో మన రాష్ట్రమే ముందుందని, దీనికి కారణం పోలీసు వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన మార్పులు, సౌకర్యాలే కారణమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
పోలీసు శకటాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామన్న, చిత్రంలో ఎమ్మెల్యే బాపురావు, కలెక్టర్ రాహుల్రాజ్, శిక్షణ కలెక్టర్ శ్రీజ, తదితరులు
ఆదిలాబాద్ నేర విభాగం, న్యూస్టుడే : ప్రజా రక్షణ వ్యవస్థలో మన రాష్ట్రమే ముందుందని, దీనికి కారణం పోలీసు వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన మార్పులు, సౌకర్యాలే కారణమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యేలు రామన్న, బాపురావు, కలెక్టర్ రాహుల్రాజ్, శిక్షణ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద ఉదయం 9 గంటలకు బేలూన్లు ఎగురేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డయల్-100, బ్లూకోర్టు, పెట్రోకార్, క్లూస్టీం, డాÞ్స్క్వాడ్, రిసెప్షన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, సీసీ టీఎన్ఎస్, సైబర్క్రైం, కమాండ్ కంట్రోల్ కేంద్రం, షీటీం, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ అంశాలకు సంబంధించిన శకటాలు, అగ్నిమాపక శకటం, ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీని ఎమ్మెల్యే జోగు రామన్న జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావు మాట్లాడుతూ మన పోలీసుల పని తీరుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ పోలీసులు అమలు చేస్తున్న స్నేహపూర్వక పోలీసింగ్ కారణంగానే నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, విజయవంతం చేసిన అధికారులు, పోలీసులకు ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వి.ఉమేందర్, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
సీసీఎస్ కానిస్టేబుల్ మహ్మద్ ఇసాక్కు ఉత్కృష్ఠ సేవా పతకం అందిస్తున్న ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
పరేడ్ మైదానంలో సంబరాలు..
ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సురక్ష దివస్ సంబరాలు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసులకు సేవాపతకాలు అందించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్పీ అధికారులను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో పోలీసు శకటాల ర్యాలీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి నగేష్పై కోడ్ ఉల్లంఘన కేసు
[ 19-04-2024]
అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఆ లోక్సభ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. -
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్