ఔత్సాహికులకు పారిశ్రామికరంగ తోడ్పాటు
ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి రాహుల్రాజ్ పేర్కొన్నారు.
స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలిస్తున్న పాలనాధికారి రాహుల్రాజ్
పాలనాప్రాంగణం, న్యూస్టుడే : ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి రాహుల్రాజ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక భుక్తాపూర్లోని డీబీఎన్డీ హాలులో జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులు ఆయా యూనిట్లను ప్రదర్శనకు పెట్టారు. వారు ఉపాధి పొందుతున్న తీరును పాలనాధికారి అడిగి తెలుసుకున్నారు. రాయితీతో కలిగిన లాభాలను లబ్ధిదారులు తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రగతిని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజరు పద్మభూషణ్రాజు వివరించారు. టీఎస్ఐపాస్ కింద జిల్లాలో రూ.97.63 కోట్లతో 1,954 మందికి ఉపాధి చూపించామన్నారు. టిఫ్రైడ్ పథకం కింద 460 యూనిట్లకు రూ.30.09 కోట్ల రాయితీతో లబ్ధి చేకూరిందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన పలువురికి జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. అదనపు పాలనాధికారి నటరాజ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎల్డీఎం భాస్కర్ ప్రసాద్, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, ఈడీఎం బండి రవి, పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
చెరువుల పండగకు విస్తృత ఏర్పాట్లు
పాలనాప్రాంగణం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహించే ఊరూరా చెరువుల పండగకు విస్తృత ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి రాహుల్రాజ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 468 పంచాయతీల పరిధిలో నిర్వహించే వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ప్రత్యేకాధికారులను నియమించామని గుర్తుచేశారు. ప్రతి మండలంలో ఒకటి చొప్పున పెద్ద ఎత్తున చెరువుల పండగను జరపాలన్నారు. వెయ్యిమందికి తక్కువ కాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రచారం చేయాలన్నారు. సాయంత్రం అయిదు గంటలకు వేడుకలు ప్రారంభించి సాయంత్రం ఏడు గంటలకు ముగిసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భోజనవసతి, తాగునీరు, లైటింగ్, టెంటు, మైక్సిస్టం వంటి సౌకర్యాలు పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోనాలు, బతుకమ్మ, కట్టమైసమ్మ పూజలతో సందడి నెలకొనాలని, చెరువు ప్రాంగణాలను రంగవల్లులు, పూలతో ఆకట్టుకునేలా అందంగా ముస్తాబు చేయాలని పేర్కొన్నారు. శిక్షణ సహాయ పాలనాధికారులు శ్రీజ, వికాస్ మహతో, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
[ 29-03-2024]
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లాలో శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
తాంసి సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
అదిలాబాద్ జిల్లా తాంసిలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు