విత్తన కంపెనీపై రైతుల విజయం.. దక్కిన పరిహారం
మా కంపెనీ విత్తనాలు బాగుంటాయి.. వాడితే దిగుబడి రెండింతలుగా ఉంటుందంటూ ఊదరగొట్టే కంపెనీల ప్రచారాన్ని చూసి రైతులు కొని విత్తుకోవడం సహజం.
చెక్కులు అందుకుంటున్న బాధిత రైతులు
కడెం, న్యూస్టుడే : మా కంపెనీ విత్తనాలు బాగుంటాయి.. వాడితే దిగుబడి రెండింతలుగా ఉంటుందంటూ ఊదరగొట్టే కంపెనీల ప్రచారాన్ని చూసి రైతులు కొని విత్తుకోవడం సహజం. ఈ క్రమంలో కడెం మండలంలోని లక్ష్మీసాగర్, మద్దిపడిగ, పెద్దూర్ తండాలకు చెందిన ఆరుగురు రైతులు 2017లో కొనుగోలు చేసి సాగుచేసిన వరి విత్తనాలు నకిలీగా తేలాయి. అప్పుడు ఖరీఫ్ పంటగా వారు సుమారు 20ఎకరాల్లో కావేరి 9090రకం విత్తనాలను కొని సాగుచేసుకున్నారు. వరి బాగానే ఎదిగినా గొలక సరిగా వేయక పంట పండలేదు. దీనిపై అప్పట్లోనే ఈ గిరిజన రైతులు దుకాణదారునికి, కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదుచేశారు. అనంతరం ఆదిలాబాద్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల వద్ద విత్తనాలు కొన్న రసీదులు, పంట నష్టపోయిన ఆధారాలు ఉండడంతో న్యాయంకోసం రైతు భూక్యా రాజేష్ నాయక్ సారథ్యంలో పోరాడారు. ఈకేసు ఆదిలాబాదు నుంచి హైదరాబాద్లోని వినియోగదారుల కోర్టుకు బదిలీ అయింది. ఆరేళ్లపాటు సాగిన విచారణ అనంతరం చివరగా రైతులే గెలిచారు. ఒక్కో ఎకరానికి రూ.40 వేల పరిహారం అప్పటినుంచి ఇప్పటివరకు ఆ డబ్బులకు వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు రావడంతో.. మంగళవారం హైదరాబాద్ కోర్టు ఆవరణలోనే కంపెనీ ప్రతినిధులు బాధితులకు చెక్కులు అందజేశారు. మొత్తం రూ.7,44,037లను చెక్కుల రూపంలో అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు విద్యార్థిని ఎంపిక
[ 24-04-2024]
జిల్లా కేంద్రం బంగారిగూడలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని జేబా అమ్రిన్ ఎస్.జి.ఎఫ్. అండర్-17 ఏళ్ల విభాగంలో జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. -
క్రీడా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 24-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పల్లెల్లో ప్లాట్లు.. కొన్నవారికి పాట్లు
[ 24-04-2024]
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. ‘రియల్’ దందా చేసే వ్యక్తులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని 396 పంచాయతీల్లో అధికారులు గుర్తించిన లేఅవుట్లు 419 ఉండగా.. ఇందులో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అనుమతులున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. -
ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే
[ 24-04-2024]
గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రక్షణ తీగలే.. యమపాశాలు
[ 24-04-2024]
రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. -
తునికాకు సేకరణకు వేళాయె..
[ 24-04-2024]
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు -
అక్రమ దందా.. అధికారుల అండ
[ 24-04-2024]
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
[ 24-04-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారామ్, -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.