అరుదైన వృక్ష శిలాజాలకు రక్షణ కరవు!
అడవుల జిల్లా కుమురంభీంలో ప్రకృతి సంపద, సహజవనరులకు ఆలవాలం. అపార ఖనిజాలతోపాటు జలపాతాలు, గోదావరి తీరం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కొండపల్లి అడవుల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో ఫాసిల్వుడ్
కొండపల్లి అడవిలో వృక్ష శిలాజాలు
బెజ్జూరు, న్యూస్టుడే: అడవుల జిల్లా కుమురంభీంలో ప్రకృతి సంపద, సహజవనరులకు ఆలవాలం. అపార ఖనిజాలతోపాటు జలపాతాలు, గోదావరి తీరం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీటికితోడు ఇక్కడ అరుదైన వృక్షశిలాజాలు మారుమూల మండలమైన పెంచికల్పేట్లోని కొండపల్లి అడవుల్లో పదేళ్ల కిందట వెలుగులోకి వచ్చాయి. వీటి రక్షణ కోసం అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపినా.. నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో వాటి రక్షణ చర్యలు కనుమరుగయ్యాయి.
పెంచికల్పేట్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ విస్తారంగా ఉన్న వృక్షశిలాజాల జాడను 2013లో అటవీ అధికారులు గుర్తించారు. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కంటే పూర్వం నాటివిగా భావిస్తున్నారు. కొండపల్లి గ్రామానికి నాలుగు కి.మీ. దూరంలో అన్వేషిస్తే 20ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల వృక్షశిలాజాలు బయటపడ్డాయి. కొన్ని తొమ్మిది నుంచి 25 అడుగుల పొడవు ఉన్నాయి. మరికొన్ని 50అడుగులు ఉండి ముక్కలైనట్లు కనిపిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా కునిఫెర జాతికి చెందినవని అటవీ అధికారులు భావించారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లయితే మరికొన్ని బయటపడతాయని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన రేంజ్ అధికారి అప్పయ్య.. సిబ్బందితో గస్తీ తిరుగుతుండగా శిలాజాలు కనిపించాయి. అప్పట్లోనే భూగర్భ గనులశాఖ అధికారులకు సమాచారమివ్వగా.. 2015లో పలుమార్లు సర్వేలు చేశారు. అదే ఏడు తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు వేముగంటి మురళీ, హరగోపాల్, ప్రభాకర్, భూమన్నలు కొండపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. వృక్ష శిలాజాలను పరిశీలించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
ముక్కలైన వృక్ష శిలాజాలు
వయసు అంచనాలు ఇలా..
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని గడ్చిరోలికి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత-గోదావరి బేసిన్లో వడదాంలో సారోఫోడ్స్ సరీసృపాల జాడలు గతంలో వెలుగుచూసిన విషయం తెల్సిందే. వాటి శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. వృక్షశిలాజాలు అక్కడే లభ్యమయ్యాయి. ఆరున్నర కోట్ల ఏళ్లకు పైగా చెందినవిగా జియాలాజికల్ ఆఫ్ ఇండియా సర్వే ద్వారా గుర్తించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వడదాం ఫాసిల్ పార్కుగా మార్చింది. అయితే కొండపల్లి అటవీ ప్రాంతానికి చేరువుగా ఉండటంతో ఇక్కడి వృక్షశిలాజాల వయసూ అంతే ఉందని అంచనా వేశారు. హిమాచల్ప్రదేశ్లో శివాలిక్ ఫాసిల్ పార్క్, ఉత్తర్ప్రదేశ్లోని సల్కాన్ ఫాసిల్ పార్క్, గుజరాత్లోని ఇంద్రోడ తరహాలో కొండపల్లిలోని వృక్షశిలాజాలు ఉన్న ప్రాంతానికి రక్షించేందుకు దాన్ని ఫాసిల్ పార్క్గా గుర్తించాలని నిపుణులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే రాక్షస బల్లుల శిలాజాల జాడలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. శిలాజాలు ఉన్న ప్రాంతాన్ని కంచెలు ఏర్పాటు చేసి పార్క్గా గుర్తిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలోనే వేమనపల్లి అటవీ ప్రాంతంలో రాక్షస బల్లి శిలాజం లభ్యం కాగా.. హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లలో ప్రదర్శనకు పెట్టిన విషయం తెల్సిందే.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
- ప్రభాకర్, డిప్యూటీ రేంజ్ అధికారి, పెంచికల్పేట్
ఉమ్మడి బెజ్జూరు మండలంలో కొండపల్లి ఉన్నప్పుడు వృక్ష శిలాజాలపై అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ విషయంలో మళ్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి రక్షణ చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె కదిలింది.. పట్టణం తడబడింది
[ 02-12-2023]
నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్లో చైతన్యం ప్రదర్శించగా.. విద్యావంతులు అత్యధికంగా ఉండే పట్టణ ప్రాంతాల ఓటర్లలో మాత్రం నిర్లిప్తత కనిపించింది. పట్టణ జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్ అర్బన్, మావల, బోథ్, ఇచ్చోడ మండలాల్లో నమోదైన పోలింగ్ శాతమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
స్ట్రాంగ్రూంల పరిశీలన
[ 02-12-2023]
ఆదిలాబాద్ పట్టణం టీటీడీసీ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. ఎన్నికల సాధారణ, పోలీసుల పరిశీలకులు నితిన్ కె.పాటిల్, అశోక్గోయల్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, బోథ్, ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారులు చాహత్బాజ్పాయ్, బి.స్రవంతి పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూంలను శుక్రవారం పరిశీలించారు. -
పోలింగ్కు అవకాశం ఇవ్వరూ!
[ 02-12-2023]
పోలింగ్ కేంద్రం లేని కారణంగా దూరభారంతో ఓటింగ్లో పాల్గొనని తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు కోరారు. -
ఆరా తీస్తున్న అగ్రనేతలు
[ 02-12-2023]
గెలుపు అవకాశాలు, ఓటమిపాలైతే కారణాలేమిటని అభ్యర్థులను రాష్ట్ర, జాతీయస్థాయి నేతలు ఆరా తీస్తున్నారు. ఏం చెప్పాలనేదానిపై తర్జనభర్జన. పది స్థానాలతో విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియగా, మిగిలిన ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విషయం విదితమే. -
పైకి ధీమా.. లోన గుబులు
[ 02-12-2023]
పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా .. లోపల గుబులుగానే ఉన్నారు. పోలింగ్ పూర్తి కావడంతో గ్రామాలవారీగా పోలైన ఓట్లు, ఆ గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై ఆరా తీస్తూ.. లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు అని ప్రకటిస్తున్నారు.. ఆదిలాబాద్లో 25, బోథ్లో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పార్టీల మధ్యనే పోరు ఉంది. -
అభ్యర్థి.. రోజు గడిపిన తీరిది
[ 02-12-2023]
ఎన్నికల్లో గెలుపు కోసం ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి ప్రచారం చేసి అలసిపోయిన అభ్యర్థులు శుక్రవారం ఏం చేస్తున్నారని ‘న్యూస్టుడే’ పరిశీలించింది. చాలా మంది తమ తమ ఇంటికే పరిమితమయ్యారు. కొందరు తమ కుటుంబ సభ్యులతో గడపగా.. -
ఎన్నికలు గుర్తుండేలా ప్రశంసలు
[ 02-12-2023]
ఎన్నికలు వచ్చాయంటే మారుమూల పల్లెల్లో పనిచేసేందుకు ఉద్యోగులు అసహనానికి గురవుతారు. ఉద్యోగ ధర్మం కోసం ఎన్నో ఇబ్బందులుపడుతూ తప్పని పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారు. వెళ్లిన చోట కనీస వసతులు లేక నిద్రలేని రాత్రులు గడుపుతారు. -
ఆసిఫాబాద్లో జంటహత్యల కలకలం
[ 02-12-2023]
కుమురం భీం జిల్లా కేంద్రంలోని బెస్తవాడలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జంటహత్యలు కలకలం సృష్టించాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్లోని బెస్తవాడకు చెందిన గుబిడె శ్రావణ్(45), బామ్నె శ్రీను(36) ఎదురెదురుగా నివాసం ఉంటున్నారు. శ్రావణ్ రాత్రి మూత్రవిసర్జనకు బయటకు వచ్చాడు. -
పైకి ధీమా.. లోపల గుబులు
[ 02-12-2023]
ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియగా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రేపు ఓటరు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపోటములపై లెక్కలు వేస్తున్నారు. ఎవరికి వారుగా గెలుస్తామన్న ధీమాతో పైకి కనిపిస్తున్నా.. లోపల ఒకింత ఆందోళన చెందుతున్నారు. -
తగ్గిన పోలింగ్.. కారణాలు అనేకం
[ 02-12-2023]
గత ఎన్నికలతో పోల్చితే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది. ఓటర్లు గతం కంటే భారీగా పెరిగినా.. పోలింగ్ శాతం తగ్గడంతో జిల్లా యంత్రాంగం పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈవీఎంలపై గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఫలితం నిక్షిప్తం.. ఈవీఎంలు భద్రం
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఓటింగ్ యంత్రాలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. -
రాత్రివేళ రక్తపాతం
[ 02-12-2023]
జిల్లా కేంద్రంలోని బెస్తవాడలో శుక్రవారం రాత్రి జంట హత్యలతో ఆసిఫాబాద్ ఉలిక్కిపడింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఫలితాల కోసం అంతా ఆసక్తిగా చూస్తున్న వేళ.. తీరికలేని విధులతో ఉద్యోగులు, ప్రచారంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు అలసిపోయి.. -
ఓడినా.. గెలిచినా.. అందుబాటులో ఉంటా
[ 02-12-2023]
సిర్పూరు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార¢ పార్టీకి కాగజ్నగర్ డివిజన్ పోలీసులు అండగా నిలిచారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పల్లెవించిన చైతన్యం..పట్టణంలో నిర్లిప్తం
[ 02-12-2023]
ఈసారి ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంత ఓటర్లు చైతన్యం ప్రదర్శించి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోగా పట్టణ ప్రాంత ఓటర్లలో నిర్లిప్తత కనిపించింది. జిల్లాలోని నియోజక వర్గాల వారిగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి కనబర్చారు. -
ప్రతి ఘట్టం.. పందేనికి సిద్ధం..
[ 02-12-2023]
కావేవి బెట్టింగులకు అనర్హం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇటీవల ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ముగిసాయే లేదా అప్పుడే శాసనసభ సమరం ఆరంభమైంది. క్రికెట్ పోటీలకు ఏ మాదిరి బెట్టింగులు జరిగాయో అదే తీరులో రాజకీయ రంగంలోనూ పోటీకి బెట్టింగు రాయుళ్లు తెరపైకి వచ్చారు. -
ఎవరి లెక్కలు వారివే..
[ 02-12-2023]
పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళి అనంతరం ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓటమి చవిచూస్తారో అంతుచిక్కడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
అతివల అండ.. ఉంటేనే దండ..
[ 02-12-2023]
జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో జరిగిన ఎన్నికల సమరంలో ఓటరు గెలిచాడు. ఓటరు చైతన్యంపై స్వీప్ కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగం చేపట్టిన అవగాహన, ప్రచార కార్యక్రమాలు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో కనిపించారు. -
ప్రశాంతం వెనక.. ప్రయత్నం ఎంతో!
[ 02-12-2023]
ఇన్నిరోజులుగా వారు పడిన కష్టం ఫలించింది. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. జిల్లా యంత్రాంగం అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ తమ విధినిర్వహణను పకడ్బందీగా చేపట్టి శాసనసభ ఎన్నికలను విజయతీరానికి చేర్చారు. గతంతో పోలిస్తే కాస్త ఓటింగ్శాతం తగ్గినా అసౌకర్యాలు, ఇబ్బందుల నడుమ ఉద్యోగులు నిర్వహించిన విధులను ఏమాత్రం తక్కువచేయలేం. -
గెలిపించేనా.. ముంచేనా...?
[ 02-12-2023]
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపై పడింది. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ఇళ్లల్లో వారు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు తమ అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గెలుపోటములపై లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 02-12-2023]
జిల్లాలో శాసనసభ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఫలితాలకు మరికొన్ని గంటలు ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి పోటీ హోరాహోరీగా ఉండటంతో గెలుపోటముల అంతరం తక్కువగానే ఉండనుంది.


తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య