అడ్డదారిలో పట్టుబడ్డారు..
బదిలీల్లో ప్రాధాన్యం కోసం అడ్డదారి తొక్కిన ఉపాధ్యాయుల పేర్లను అధికారులు తొలగించారు. వచ్చిన ఫిర్యాదులు, పత్రికలో వచ్చిన కథనాలు, అధికారుల ఆదేశాలతో వారు స్పందించారు.
ఉపాధ్యాయ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో 17 మందికి చుక్కెదురు
శిబిరంలో పునః పరిశీలన చేస్తున్న వైద్యులు
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: బదిలీల్లో ప్రాధాన్యం కోసం అడ్డదారి తొక్కిన ఉపాధ్యాయుల పేర్లను అధికారులు తొలగించారు. వచ్చిన ఫిర్యాదులు, పత్రికలో వచ్చిన కథనాలు, అధికారుల ఆదేశాలతో వారు స్పందించారు. ఫలితంగా అర్హులైన ఇతర ఉద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడింది.
మొదట ఆరుగురు.. ఆ తర్వాత 11..
ఉపాధ్యాయ బదిలీల్లో ప్రాధాన్యత కోసం కొంతమంది ప్రిఫరెన్షియల్ కేటగిరీలో దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అర్హత లేకపోయినా కొందరు అదనపు ప్రయోజనం కోసం తప్పుడుమార్గాలను ఎంచుకుంటున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దీంతో విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అనర్హులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా తమ దరఖాస్తులు ఉపసంహరించుకోవాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత ఆరుగురు తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. ఇక అంతా సక్రమమే అనుకున్నారు. అయినప్పటికీ జాబితాలో ఉన్న ఉద్యోగుల్లో కొందరిపై ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేస్తే తప్ప అసలు విషయాలు బయటపడవంటూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై ‘ఈనాడు’లో ‘దరఖాస్తులు సక్రమమేనా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా వైద్యసిబ్బందితో పునః పరిశీలన ఏర్పాటుచేశారు. ఒకేరోజు అవకాశం కల్పించినా, కొందరు గైర్హాజరవడం, మరికొందరు చికిత్సలో ఉండటంతో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో గురువారం సైతం పరిశీలనకు హాజరయ్యేందుకు అవకాశమిచ్చారు. అయితే.. దరఖాస్తులు సమర్పించిన వారిలో ఇద్దరు గైర్హాజరు కాగా, మరో 9 మంది దరఖాస్తులను వైద్యులు తిరస్కరించారు. మొత్తంగా రెండు విడతల్లో 17 మందిని ప్రిఫరెన్షియల్ కేటగిరీ నుంచి తొలగించినట్లయ్యింది.
చర్యలుంటాయా..?
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించొద్దని మొదట్లోనే హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తూ కొందరు నిర్భయంగా తమ దరఖాస్తులు సమర్పించారు. దీర్ఘకాల, తీవ్రమైన వ్యాధులకు గతంలో చికిత్స పొందినప్పటికీ, వ్యాధితీవ్రత తగ్గిందనో, నయమైందన్న కారణాలతోనో కొందరిని తిరస్కరించారు. మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇందులో ఒకరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించేందుకు ఆసక్తి లేదంటూ విద్యాశాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలిపారు. సదరు ఉద్యోగి స్పౌజ్ పాయింట్లను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పక్కనపెడితే.. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు తెలిసీ ప్రయత్నించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలుంటాయా లేదా అనేది ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ఆస్కారముండదని, ఉద్యోగుల్లో భయం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.
వివరణ కోరుతాం
డా.ఎ.రవీందర్రెడ్డి, జిల్లా విద్యాధికారి
హెచ్చరికలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినవారు, గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం. వారి నుంచి వివరణ కోరుతాం. ప్రిఫిరెన్షియల్ కేటగిరీ పాయింట్లను తొలగించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. పదోన్నతులు, బదిలీల్లో భాగంగా ఉద్యోగులంతా పారదర్శకంగా వ్యవహరించాలి. స్పౌజ్ పాయింట్ల విషయంలోనూ కొందరు తప్పుడు వివరాలు (2018 బదిలీల సమయంలో వాడుకొని, మళ్లీ ఇప్పుడు ఉపయోగించే ప్రయత్నం చేస్తుండటం) సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటివారు దరఖాస్తులను ముందుగానే తొలగించుకోవాలి. విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా జోనల్ స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
[ 02-12-2023]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శనివారం అండర్-17 విభాగంలో బాలుర జోనల్ స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 02-12-2023]
26 మంది పత్తి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. -
Adilabad:: ఓటు వేస్తాం.. మా గ్రామానికి ఇంకో అవకాశం ఇవ్వండి!
[ 02-12-2023]
పోలింగ్ కేంద్రం లేని కారణంగా దూరభారంతో ఓటింగ్లో పాల్గొనని తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు కోరారు. -
పల్లె కదిలింది.. పట్టణం తడబడింది
[ 02-12-2023]
నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్లో చైతన్యం ప్రదర్శించగా.. విద్యావంతులు అత్యధికంగా ఉండే పట్టణ ప్రాంతాల ఓటర్లలో మాత్రం నిర్లిప్తత కనిపించింది. పట్టణ జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్ అర్బన్, మావల, బోథ్, ఇచ్చోడ మండలాల్లో నమోదైన పోలింగ్ శాతమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
స్ట్రాంగ్రూంల పరిశీలన
[ 02-12-2023]
ఆదిలాబాద్ పట్టణం టీటీడీసీ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. ఎన్నికల సాధారణ, పోలీసుల పరిశీలకులు నితిన్ కె.పాటిల్, అశోక్గోయల్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, బోథ్, ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారులు చాహత్బాజ్పాయ్, బి.స్రవంతి పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూంలను శుక్రవారం పరిశీలించారు. -
ఆరా తీస్తున్న అగ్రనేతలు
[ 02-12-2023]
గెలుపు అవకాశాలు, ఓటమిపాలైతే కారణాలేమిటని అభ్యర్థులను రాష్ట్ర, జాతీయస్థాయి నేతలు ఆరా తీస్తున్నారు. ఏం చెప్పాలనేదానిపై తర్జనభర్జన. పది స్థానాలతో విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియగా, మిగిలిన ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విషయం విదితమే. -
పైకి ధీమా.. లోన గుబులు
[ 02-12-2023]
పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా .. లోపల గుబులుగానే ఉన్నారు. పోలింగ్ పూర్తి కావడంతో గ్రామాలవారీగా పోలైన ఓట్లు, ఆ గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై ఆరా తీస్తూ.. లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు అని ప్రకటిస్తున్నారు.. ఆదిలాబాద్లో 25, బోథ్లో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పార్టీల మధ్యనే పోరు ఉంది. -
అభ్యర్థి.. రోజు గడిపిన తీరిది
[ 02-12-2023]
ఎన్నికల్లో గెలుపు కోసం ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి ప్రచారం చేసి అలసిపోయిన అభ్యర్థులు శుక్రవారం ఏం చేస్తున్నారని ‘న్యూస్టుడే’ పరిశీలించింది. చాలా మంది తమ తమ ఇంటికే పరిమితమయ్యారు. కొందరు తమ కుటుంబ సభ్యులతో గడపగా.. -
ఎన్నికలు గుర్తుండేలా ప్రశంసలు
[ 02-12-2023]
ఎన్నికలు వచ్చాయంటే మారుమూల పల్లెల్లో పనిచేసేందుకు ఉద్యోగులు అసహనానికి గురవుతారు. ఉద్యోగ ధర్మం కోసం ఎన్నో ఇబ్బందులుపడుతూ తప్పని పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారు. వెళ్లిన చోట కనీస వసతులు లేక నిద్రలేని రాత్రులు గడుపుతారు. -
ఆసిఫాబాద్లో జంటహత్యల కలకలం
[ 02-12-2023]
కుమురం భీం జిల్లా కేంద్రంలోని బెస్తవాడలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జంటహత్యలు కలకలం సృష్టించాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్లోని బెస్తవాడకు చెందిన గుబిడె శ్రావణ్(45), బామ్నె శ్రీను(36) ఎదురెదురుగా నివాసం ఉంటున్నారు. శ్రావణ్ రాత్రి మూత్రవిసర్జనకు బయటకు వచ్చాడు. -
పైకి ధీమా.. లోపల గుబులు
[ 02-12-2023]
ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియగా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రేపు ఓటరు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపోటములపై లెక్కలు వేస్తున్నారు. ఎవరికి వారుగా గెలుస్తామన్న ధీమాతో పైకి కనిపిస్తున్నా.. లోపల ఒకింత ఆందోళన చెందుతున్నారు. -
తగ్గిన పోలింగ్.. కారణాలు అనేకం
[ 02-12-2023]
గత ఎన్నికలతో పోల్చితే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది. ఓటర్లు గతం కంటే భారీగా పెరిగినా.. పోలింగ్ శాతం తగ్గడంతో జిల్లా యంత్రాంగం పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈవీఎంలపై గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఫలితం నిక్షిప్తం.. ఈవీఎంలు భద్రం
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఓటింగ్ యంత్రాలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. -
రాత్రివేళ రక్తపాతం
[ 02-12-2023]
జిల్లా కేంద్రంలోని బెస్తవాడలో శుక్రవారం రాత్రి జంట హత్యలతో ఆసిఫాబాద్ ఉలిక్కిపడింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఫలితాల కోసం అంతా ఆసక్తిగా చూస్తున్న వేళ.. తీరికలేని విధులతో ఉద్యోగులు, ప్రచారంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు అలసిపోయి.. -
ఓడినా.. గెలిచినా.. అందుబాటులో ఉంటా
[ 02-12-2023]
సిర్పూరు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి కాగజ్నగర్ డివిజన్ పోలీసులు అండగా నిలిచారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పల్లెవించిన చైతన్యం..పట్టణంలో నిర్లిప్తం
[ 02-12-2023]
ఈసారి ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంత ఓటర్లు చైతన్యం ప్రదర్శించి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోగా పట్టణ ప్రాంత ఓటర్లలో నిర్లిప్తత కనిపించింది. జిల్లాలోని నియోజక వర్గాల వారిగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి కనబర్చారు. -
ప్రతి ఘట్టం.. పందేనికి సిద్ధం..
[ 02-12-2023]
కావేవి బెట్టింగులకు అనర్హం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇటీవల ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ముగిసాయే లేదా అప్పుడే శాసనసభ సమరం ఆరంభమైంది. క్రికెట్ పోటీలకు ఏ మాదిరి బెట్టింగులు జరిగాయో అదే తీరులో రాజకీయ రంగంలోనూ పోటీకి బెట్టింగు రాయుళ్లు తెరపైకి వచ్చారు. -
ఎవరి లెక్కలు వారివే..
[ 02-12-2023]
పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళి అనంతరం ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓటమి చవిచూస్తారో అంతుచిక్కడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
అతివల అండ.. ఉంటేనే దండ..
[ 02-12-2023]
జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో జరిగిన ఎన్నికల సమరంలో ఓటరు గెలిచాడు. ఓటరు చైతన్యంపై స్వీప్ కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగం చేపట్టిన అవగాహన, ప్రచార కార్యక్రమాలు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో కనిపించారు. -
ప్రశాంతం వెనక.. ప్రయత్నం ఎంతో!
[ 02-12-2023]
ఇన్నిరోజులుగా వారు పడిన కష్టం ఫలించింది. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. జిల్లా యంత్రాంగం అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ తమ విధినిర్వహణను పకడ్బందీగా చేపట్టి శాసనసభ ఎన్నికలను విజయతీరానికి చేర్చారు. గతంతో పోలిస్తే కాస్త ఓటింగ్శాతం తగ్గినా అసౌకర్యాలు, ఇబ్బందుల నడుమ ఉద్యోగులు నిర్వహించిన విధులను ఏమాత్రం తక్కువచేయలేం. -
గెలిపించేనా.. ముంచేనా...?
[ 02-12-2023]
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపై పడింది. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ఇళ్లల్లో వారు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు తమ అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గెలుపోటములపై లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 02-12-2023]
జిల్లాలో శాసనసభ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఫలితాలకు మరికొన్ని గంటలు ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి పోటీ హోరాహోరీగా ఉండటంతో గెలుపోటముల అంతరం తక్కువగానే ఉండనుంది.


తాజా వార్తలు (Latest News)
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా