తేలనున్న సింగరేణి ఎన్నికల భవితవ్యం
సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల భవితవ్యం నేడు తేలే అవకాశం ఉంది. రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల విషయంలో వేసిన రిట్ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది.
నేడు హైకోర్టు తీర్పు
న్యూస్టుడే, శ్రీరాంపూర్: సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల భవితవ్యం నేడు తేలే అవకాశం ఉంది. రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల విషయంలో వేసిన రిట్ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. గురువారం వాదనలు పూర్తయ్యాయని శుక్రవారం మధ్యాహ్నంలోగా తీర్పు వెలువడుతుందని తెబొగకాసం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి ఏనుగు రవిందర్రెడ్డి ‘న్యూస్టుడే’కు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ నిర్ణయం కోసం నేడు కేంద్ర కార్మికశాఖకు చెందిన డిప్యూటీ లేబర్ కమిషనర్(డీఎల్సీ) సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు జరగనున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానికి అనుగుణంగా చర్చల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గుర్తింపు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై అందరి దృష్టి నేటి కోర్టు తీర్పు, డీఎల్సీ వద్ద జరిగే చర్చలవైపు మళ్లింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తెలంగాణ శాసనసభకు అక్టోబరు నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో సింగరేణి కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పాలనాధికారులు చొరవ తీసుకుని ఎన్నికల నిర్వహణకు ముందుకు రావాల్సి ఉంటుంది. సింగరేణి యాజమాన్యం సొంతగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికల వాయిదా కోరుతూ గతంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. గుర్తింపు సంఘం కాలపరిమితిని ముందుగానే నిర్ణయించాలంటూ తెబొగకాసం.. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు వెంటనే జరపాలంటూ ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మూడు పిటిషన్లపై శుక్రవారం తుది తీర్పు వెలువడనుంది. ఒకవేళ కోర్టు ఎన్నికలకు అనుకూలంగా తీర్పునిస్తే డీఎల్సీ సమక్షంలో నోటిఫికేషన్ ఖరారు కానుంది.
సమాన ప్రాతినిధ్యం కల్పించాలంటూ..
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు దగ్గరలో ఉండటంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సింగరేణి ఎన్నికల నిర్వహణకు ముందుకు వస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాలెట్ బాక్సులు వినియోగించాలా, ఈవీఎంలు వాడాలా అన్న విషయంలోనూ కార్మిక సంఘాల మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని సంఘాలకు అసలు ఎన్నికలు నిర్వహించడమే ఇష్టం లేదు. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే విషయం వాటికి తెలుసు. తమ అంతరంగం బయటపడకుండా ఎన్నికలు జరపాలంటూనే.. అప్పటి వరకు అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో చాలా సంఘాలు ఉన్నాయి. కోల్ ఇండియా మాదిరిగా జాతీయ సంఘాలన్నింటికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సంఘాలన్నీ యాజమాన్యంతో చర్చలు జరపడానికి తహతహలాడుతున్నాయే తప్ప, కార్మికవర్గం సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణిలో గుర్తింపు ఎన్నికల జరిగితే తమకు మేలు జరుగుతుందని తెబొగకాసం, ఏఐటీయూసీ అంచనా వేస్తున్నాయి. మిగతా సంఘాల నేతల్లో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో సింగరేణి ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైకిమాత్రం ఎన్నికలు జరగాల్సిందేనంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
[ 01-12-2023]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
Telangana Elections: రూ. 2.50 లక్షలు ఖర్చయినా దక్కని ఓటు హక్కు
[ 01-12-2023]
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ 15 ఏళ్లుగా న్యూజిలాండ్లోని ఓ కంపెనీలో వెల్డర్గా పని చేస్తున్నారు. -
వెల్లివిరిసిన ఓటరు చైౖతన్యం
[ 01-12-2023]
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకుని జిల్లాలో ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. -
టీటీడీసీ కేంద్రానికి ఈవీఎంల తరలింపు
[ 01-12-2023]
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగించుకున్న సిబ్బంది ఒక్కొక్కరుగా గురువారం రాత్రి వరకు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. -
ఓటేశాం.. గొప్ప అనుభూతిని పొందాం
[ 01-12-2023]
తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భం మరిచిపోని అనుభూతినిస్తుంది. -
నిండుగా.. ఓట్ల పండగ..
[ 01-12-2023]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
ప్రచారం అయినా.. ప్రయోజనమే
[ 01-12-2023]
జిల్లాలో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సంబంధిత సిబ్బందిని సంప్రదించి పోలింగ్ చీటీలు తీసుకున్నారు. -
వాగు దాటి చైతన్యం చాటి.!
[ 01-12-2023]
అన్ని సౌకర్యాలు ఉండి.. పోలింగ్ కేంద్రం ఇంటికి సమీపంలోనే ఉన్నా.. ఓటేంవేస్తాంలే అనుకునే వారు చాలా మంది కనిపిస్తుంటారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
[ 01-12-2023]
శాసనససభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భాజపా నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్ రాఠోడ్ తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాఠోడ్తో కలిసి వచ్చి ఉట్నూరులోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బాలింత.. స్ఫూర్తి ఆకాశమంత
[ 01-12-2023]
-
నాలుగు తరాలు
[ 01-12-2023]
ఇంద్రవెల్లి మండలం అంజి పోలింగ్ బూత్లో మామిడిగూడకు చెందిన నాలుగు తరాలవారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
ఆలస్యంగా మొదలై.. రాత్రి వరకు పోలింగ్
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. -
అభ్యర్థుల ఓటుబాట
[ 01-12-2023]
జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్లో పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఓటు గల్లంతు..!
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరుకు పోల్ చీటీ పంపిణీ చేయాలని ఆదేశించింది. -
ఛాలెంజ్ చేసి.. ఓటు వేసి
[ 01-12-2023]
ఆసిఫాబాద్ పట్టణం 190వ పోలింగ్ కేంద్రంలో కంచుకోటకు చెందిన వేముల నాగమణికి ఓటుహక్కు ఉంది. -
పల్లె, పట్నం ఓటుకు కదిలె..
[ 01-12-2023]
మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కండువా వేసుకొని.. ఓటేసి
[ 01-12-2023]
బెల్లంపల్లి భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే చిన్నయ్య తన సొంత గ్రామ నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. -
వయో వృద్ధులు.. ఓటు ధీరులు
[ 01-12-2023]
గురువారం జరిగిన ఓట్ల పండగ రోజు వృద్ధులు, దివ్యాంగులు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
పంచాయతీ చేస్తామని హామీ ఇస్తేనే ఓటేస్తాం
[ 01-12-2023]
తమ గ్రామాల ప్రజలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే ఆరు కి.మీ. దూర భారం అవుతుందని.. ఏళ్లుగా తమ గ్రామాన్ని పంచాయతీగా చేయాలని కోరుతున్నా పట్టించుకోలేదని వరిపేట గ్రామస్థులు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. -
ఓటేయడానికి వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి
[ 01-12-2023]
పోలింగ్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. -
పోరు ముగిసింది.. ఫలితమే మిగిలింది
[ 01-12-2023]
జిల్లాలో శాసనసభ ఎన్నికల ఘట్టం గురువారం ముగిసింది. పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరగడంతో ముఖ్యఅంకానికి తెరపడింది. -
కూడినా తీసివేసినా ఆఖరుకు ‘ప్లస్సే’..!!
[ 01-12-2023]
సాధారణంగా కూడికలు, తీసివేతల్లో ఆఖరుకు లెక్క వేర్వేరుగా వస్తుంది. -
ఓటర్ల నిరాసక్తత
[ 01-12-2023]
ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు. -
మొరాయించిన ఈవీఎంలు.. చెదురుమదురు ఘటనలు
[ 01-12-2023]
జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది.


తాజా వార్తలు (Latest News)
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
-
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!