రుణమివ్వరు.. డబ్బులివ్వరు!
తలమడుగు మండలంలో పని చేసే గంగయ్య జమ డబ్బుల గడువు ముగిసింది. వడ్డీతో సహా కలిపి ఆయనకు రావాల్సిన రూ.8.10 లక్షలను 2023 ఫిబ్రవరిలోనే అందించాలి.
అక్కరకు రాని ఉద్యోగుల జీవిత బీమా
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
ఆదిలాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం
- తలమడుగు మండలంలో పని చేసే గంగయ్య జమ డబ్బుల గడువు ముగిసింది. వడ్డీతో సహా కలిపి ఆయనకు రావాల్సిన రూ.8.10 లక్షలను 2023 ఫిబ్రవరిలోనే అందించాలి. ఆయన తన వద్ద ఉన్న బాండు కార్యాలయంలో సమర్పించగా చెక్కు ఖజనా శాఖకు పంపించారు. డబ్బులు ఇప్పటి వరకు ఆయన చేతికందలేదు.
- గుడిహత్నూర్లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ ఇంటి నిర్మాణం కోసం జమ చేసుకున్న డబ్బుల్లోంచి రూ.2.50 లక్షలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2022 డిసెంబరు నుంచి ఆయన రుణం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అడిగితే ట్రెజరీ కార్యాలయంలో ఈ-కుభేర్లో పెండింగ్లో ఉందని సమాధానం దాటవేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు వందల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా శాఖ అక్కరకు రాకుండా పోతోంది. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతి నెల జమ చేసుకున్న డబ్బుల్లోంచి రుణం ఇవ్వడం మాట అటుంచి గడువు ముగిసినా ఇవ్వాల్సిన డబ్బులు సైతం చెల్లించడం లేదు. గట్టిగా అడిగితే తమ తప్పిదమేమి లేదని ఖజానా శాఖలో పెండింగ్లో ఉందంటూ కార్యాలయ ఉద్యోగులు చేతులు దులుపేసుకుంటుండటం విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని చేసే అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులకు వారి వేతనాన్ని బట్టి బీమా కార్యాలయంలో డబ్బులు జమ అవుతుంటాయి. ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పోలీసులు, ఆబ్కారీ, అటవీ, పురపాలక, పంచాయతీ, ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖ ఇలా అందరు ఉద్యోగులు తప్పనిసరిగా ఇందులో బీమా తీసుకోవాల్సిందే. వీరందరి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా శాఖ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రత్యేకంగా సహాయ సంచాలకులు(డైరెక్టర్), ఇతర సిబ్బందిని నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే పర్యవేక్షణ ఉంటుంది. ఉద్యోగుల మూలవేతనం(బేసిక్ పే) ఆధారంగా నెలకు కనిష్ఠంగా రూ.750 జమ చేయాల్సిందే. గరిష్ఠంగా రూ.20 వేల వరకు జమ చేసుకునే వీలుంది. ఎంత ఎక్కువ జమ చేసుకుంటే అంత ఎక్కువ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా వర్తిస్తుంది. ఉద్యోగి పాలసీ గడువు ముగిశాక వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇస్తారు. ఇందులో ఒక వెసులుబాటు సైతం కల్పించారు. జమ చేసుకున్న డబ్బుల్లోంచి అవసరమున్నప్పుడు రుణం తీసుకోవచ్చు. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉన్నా డబ్బులు రాకపోవడమే అసలు సమస్యగా మారింది. డీడీఓ(డ్రాయింగ్ అధికారుల) ద్వారా దరఖాస్తు చేసుకొని నెలల తరబడి ఉద్యోగులు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఆదిలాబాద్లోనే ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం(టీఎస్ జీఎల్ఐ) కార్యాలయం ఉండటం వల్ల మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లావాసులు సైతం ఆదిలాబాద్కు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ట్రెజరీ కార్యాలయానికి సైతం వెళ్లి ఆరా తీస్తున్నారు. ఈ-కుభేర్లో పెండింగ్లో ఉందని తెలియడంతో వెనుదిరుగుతున్నారు. పదవీ విరమణ పొందిన చాలామంది డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు.
28 వేల మందికిపైగా ఖాతాదారులు..
జీవిత బీమా కార్యాలయంలో 28,102 మంది వరకు ఖాతాదారులున్నారు. వీరికి రూ.కోట్లలో నిధులు రావాలి. ప్రస్తుతం ఇందులో 800 మందికిపైగా ఉద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ పొందిన, బాండు గడువు ముగిసిన ఉద్యోగులు మరో 200 మంది వరకు ఉంటారు. వీరందరికి రావాల్సిన డబ్బులు చేతికందక ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- ఈ విషయమై కార్యాలయ అధికారులను ‘న్యూస్టుడే’ సంప్రదించగా తాము వివరాలు వెల్లడించడానికి వీల్లేదంటూ సమాధానం దాటవేశారు. తమ వద్ద ఎలాంటి సమస్య లేదని.. ట్రెజరీలోనే పెండింగ్ ఉందంటూ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
[ 01-12-2023]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
Telangana Elections: రూ. 2.50 లక్షలు ఖర్చయినా దక్కని ఓటు హక్కు
[ 01-12-2023]
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ 15 ఏళ్లుగా న్యూజిలాండ్లోని ఓ కంపెనీలో వెల్డర్గా పని చేస్తున్నారు. -
వెల్లివిరిసిన ఓటరు చైౖతన్యం
[ 01-12-2023]
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకుని జిల్లాలో ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. -
టీటీడీసీ కేంద్రానికి ఈవీఎంల తరలింపు
[ 01-12-2023]
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగించుకున్న సిబ్బంది ఒక్కొక్కరుగా గురువారం రాత్రి వరకు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. -
ఓటేశాం.. గొప్ప అనుభూతిని పొందాం
[ 01-12-2023]
తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భం మరిచిపోని అనుభూతినిస్తుంది. -
నిండుగా.. ఓట్ల పండగ..
[ 01-12-2023]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
ప్రచారం అయినా.. ప్రయోజనమే
[ 01-12-2023]
జిల్లాలో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సంబంధిత సిబ్బందిని సంప్రదించి పోలింగ్ చీటీలు తీసుకున్నారు. -
వాగు దాటి చైతన్యం చాటి.!
[ 01-12-2023]
అన్ని సౌకర్యాలు ఉండి.. పోలింగ్ కేంద్రం ఇంటికి సమీపంలోనే ఉన్నా.. ఓటేంవేస్తాంలే అనుకునే వారు చాలా మంది కనిపిస్తుంటారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
[ 01-12-2023]
శాసనససభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భాజపా నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్ రాఠోడ్ తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాఠోడ్తో కలిసి వచ్చి ఉట్నూరులోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బాలింత.. స్ఫూర్తి ఆకాశమంత
[ 01-12-2023]
-
నాలుగు తరాలు
[ 01-12-2023]
ఇంద్రవెల్లి మండలం అంజి పోలింగ్ బూత్లో మామిడిగూడకు చెందిన నాలుగు తరాలవారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
ఆలస్యంగా మొదలై.. రాత్రి వరకు పోలింగ్
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. -
అభ్యర్థుల ఓటుబాట
[ 01-12-2023]
జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్లో పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఓటు గల్లంతు..!
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరుకు పోల్ చీటీ పంపిణీ చేయాలని ఆదేశించింది. -
ఛాలెంజ్ చేసి.. ఓటు వేసి
[ 01-12-2023]
ఆసిఫాబాద్ పట్టణం 190వ పోలింగ్ కేంద్రంలో కంచుకోటకు చెందిన వేముల నాగమణికి ఓటుహక్కు ఉంది. -
పల్లె, పట్నం ఓటుకు కదిలె..
[ 01-12-2023]
మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కండువా వేసుకొని.. ఓటేసి
[ 01-12-2023]
బెల్లంపల్లి భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే చిన్నయ్య తన సొంత గ్రామ నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. -
వయో వృద్ధులు.. ఓటు ధీరులు
[ 01-12-2023]
గురువారం జరిగిన ఓట్ల పండగ రోజు వృద్ధులు, దివ్యాంగులు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
పంచాయతీ చేస్తామని హామీ ఇస్తేనే ఓటేస్తాం
[ 01-12-2023]
తమ గ్రామాల ప్రజలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే ఆరు కి.మీ. దూర భారం అవుతుందని.. ఏళ్లుగా తమ గ్రామాన్ని పంచాయతీగా చేయాలని కోరుతున్నా పట్టించుకోలేదని వరిపేట గ్రామస్థులు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. -
ఓటేయడానికి వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి
[ 01-12-2023]
పోలింగ్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. -
పోరు ముగిసింది.. ఫలితమే మిగిలింది
[ 01-12-2023]
జిల్లాలో శాసనసభ ఎన్నికల ఘట్టం గురువారం ముగిసింది. పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరగడంతో ముఖ్యఅంకానికి తెరపడింది. -
కూడినా తీసివేసినా ఆఖరుకు ‘ప్లస్సే’..!!
[ 01-12-2023]
సాధారణంగా కూడికలు, తీసివేతల్లో ఆఖరుకు లెక్క వేర్వేరుగా వస్తుంది. -
ఓటర్ల నిరాసక్తత
[ 01-12-2023]
ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు. -
మొరాయించిన ఈవీఎంలు.. చెదురుమదురు ఘటనలు
[ 01-12-2023]
జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది.


తాజా వార్తలు (Latest News)
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?