logo

నీటితొట్టెలో పడి దివ్యాంగ బాలుడి మృతి

అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఓ మానసిక, శారీరక దివ్యాంగ బాలుడు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం...

Updated : 23 May 2022 06:23 IST


నాగ ఆదిత్య (పాతచిత్రం)

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఓ మానసిక, శారీరక దివ్యాంగ బాలుడు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... విజయరామరాజుపేటలో నివసిస్తున్న రమేష్‌, నాగమణి కుమారుడు గోలి నాగఆదిత్య (10). ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడిపోయాడు. తల్లి నాగమణి గుర్తించి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగమణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడి మృతితో వారు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని