చమురు @ నల్లబజారు
జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు నిల్వలకు డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సరఫరాదారులు
బంకుల్లో ‘నోస్టాక్’
పట్టణ శివారులోని ఓ దుకాణం వద్ద పెట్రోల్ నిల్వలు
పాడేరు, న్యూస్టుడే: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు నిల్వలకు డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సరఫరాదారులు దిగువస్థాయి డీలర్లకు విధించిన కొత్త నిబంధనలతో బంకులకు పూర్తిస్థాయిలో నిల్వలు చేరని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వినియోగదార్లకు సరిపడా చమురు బంకుల వద్ద అందుబాటులో ఉండడం లేదు. గత వారం రోజులుగా పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి. ఇదే సమయంలో బయట మార్కెట్లో నిల్వలు సమృద్ధిగా ఉంటుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డిమాండ్ను ఆసరాగా తీసుకున్న బయట వ్యాపారులు ఒక్కో లీటరుకు అదనంగా రూ.30 వరకు వసూలు చేస్తున్నారు.
సరఫరాలో కోత : పెట్రోల్ బంకులకు గతంలో సరఫరా చేసే నిల్వల్లో కోత విధిస్తుండడంతో పూర్తిస్థాయిలో నిర్వాహకులు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇటీవల మారిన మారిన నిబంధనల ప్రకారం బంకులకు ఇచ్చే నిల్వల్లో 40 శాతం కోత విధించారు. గతంలో రోజుకు ఓ ట్యాంకు తెప్పించుకునే స్థాయి ఉన్న బంకులకు సైతం తాజాగా రెండు రోజులకు ఒకటి రావడం కష్టంగా మారింది. పాడేరు పట్టణంలో నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒక్కో బంకు ఓ ట్యాంకును ఒక రోజు మొత్తం విక్రయించేవారు. ఒక ట్యాంకులో 12 వేల లీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో వచ్చిన నిల్వలు గంటలోనే అమ్మేస్తూ నోస్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో వాహన సంచారం, రద్దీ ఎక్కువైంది. దీనికి అనుగుణంగానే చమురు వినియోగశాతం పెరిగిందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో ప్రత్యేక అనుమతులతో నిల్వలు పెంచి కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.
పాడేరులో రద్దీగా ఉన్న ఓ పెట్రోల్ బంకు
అదనంగా రూ.30
పాడేరు పట్టణ శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ను అనధికారికంగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా చింతలవీధి, బంధవీధి, గుత్తులపుట్టు, నక్కలపుట్టు, మినుములూరు, బొక్కెళ్లు గ్రామాల్లో ఆయిల్ దొరుకుతోంది. పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు చూసిన వినియోగదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఆసుపత్రి, ఇతర అత్యవసరాలకు వెళ్లేవారు పెట్రోల్, డీజిల్ కోసం బయట మార్కెట్లపై ఆధారపడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న బయట వ్యాపారులు లీటరు పెట్రోల్ను రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు బయట మార్కెట్ ధరలతో తమకు సంబంధం లేదని స్థానిక బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల లీటరు పెట్రోల్ ధర రూ.10 వరకు తగ్గించింది. కొత్త ధర ప్రకారం లీటరు రూ.110 వరకు ఉంది. అంతకు ముందు రోజు నుంచే జిల్లా కేంద్రమైన పాడేరులో ఆయిల్ కొరత ఏర్పడింది. దీని ఫలితంగా దేశమంతా చమురు ధరలు తగ్గినా పాడేరులో మాత్రం రూ. 30 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
- రుద్రరాజు సత్యనారాయణరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి
జిల్లాలోని పెట్రోల్ బంకులపై నివేదిక సేకరిస్తున్నాం. జిల్లా కేంద్రంలో నాలుగు బంకుల్లో డీజిల్, పెట్రోల్ ట్యాంకులు ఏ మేరకు సరఫరా అవుతున్నాయి. వాటిని ఏ విధంగా విక్రయిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నాం. నిల్వలు ఉండి నోస్టాక్ బోర్డులు ప్రదర్శించే వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. బయట మార్కెట్కు నిల్వల తరలింపుపై ఆకస్మిక తనిఖీలు చేపడతాం. పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పరిశీలన చేస్తున్నాం. వినియోగదార్లకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్