‘రేలా’రే రేలా.. చిందేసే వేళ!
మన్యంలోని గిరిజన గ్రామాలకో ప్రత్యేకత ఉంది. వ్యవసాయం చేయాలంటే ముందుగా భూమి పండగలు చేస్తేనే సాగు మొదలుపెడతారు. ఈ పండగలను ఖరీఫ్ ఆరంభానికి ముందు వర్షాకాలం వచ్చిన వెంటనే మొదలు పడతారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసులు
కూనవరం, చింతూరు - న్యూస్టుడే
మన్యంలోని గిరిజన గ్రామాలకో ప్రత్యేకత ఉంది. వ్యవసాయం చేయాలంటే ముందుగా భూమి పండగలు చేస్తేనే సాగు మొదలుపెడతారు. ఈ పండగలను ఖరీఫ్ ఆరంభానికి ముందు వర్షాకాలం వచ్చిన వెంటనే మొదలు పడతారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసులు మొత్తం ఒక్కటై సంప్రదాయ పద్ధతిలో వీటిని నిర్వహిస్తారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఈ కాలంలో ఏ గ్రామానికి వెళ్లినా రేలా నృత్యాలతో సందడి చేస్తూ ఆదివాసులు కన్పిస్తుంటారు.
ప్రతి గిరిజన గ్రామంలోనూ ఓ ఇంటి పేరు వారు పెద్దరికం చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఆ ఇంటి పేరు వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ఏ పండగలు జరగాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా వారి ఆధ్వర్యంలోనే జరిపిస్తారు. భూమి పండగలకు ముందు ఆ ఇంటి పేరు వారు ఇలవేల్పు పండగ చేస్తారు. ఆ ఇంటి పేరు ఉన్న వారు మాత్రమే కొంత నగదు వేసుకుని దీన్ని జరుపుతారు. ఇలవేల్పుగా కొలుస్తున్న చెట్టు వద్ద పూజలు చేసి అన్ని రకాల విత్తనాలను అక్కడ ఉంచుతారు. తరువాత గ్రామంలోని ఆ ఇంటిపేరు వారు మొత్తం కలసి సహపంక్తి భోజనాలు చేస్తారు.
ఇలవేల్పు పూజలో గ్రామస్థులు
సంప్రదాయ క్రీడలో అందరూ...
ఇలవేల్పు పండగ జరిగిన మరుసటి రోజు భూమి పండగలు మొదలుపెడతారు. ముందుగా గ్రామంలో కొలుపులు చేసే ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి అందులో సాగులో వినియోగించే పరికరాలు ఉంచుతారు. పూజల అనంతరం మొక్కులు (జంతు బలి) చెల్లించుకుని వేటకు సిద్ధమవుతారు. పరికరాలు ఉంచిన గుంత చుట్టూ మహిళలు రేలా నృత్యాలతో పాటలు పాడుతూ పురుషులను వేటకు ఉత్సాహపరుస్తారు. ఇక్కడ పట్టభద్రులైనా... ఉద్యోగులైనా ఈ సంప్రదాయ క్రీడలో పాల్గొనాల్సిందే. వేటకు ముందు ఓ ప్రాంతంలో కోడిగుడ్డును పెట్టి అక్కడ నుంచి ఏడు విల్లంబులు దూరంలో నిలబడి మహిళలు బాణాలతో దానిని కొడతారు. వారు కొట్టలేని సమయంలో పురుషులు ఆ కోడిగుడ్డును కొడతారు. గుడ్డు పగిలిన ప్రాంతంలో మూడు పుల్లలను పైనుంచి కిందకు వేస్తారు. అవి ఏ దిక్కును చూపిస్తే ఆ దిక్కులో పురుషులు వేటకు వెళతారు. ఈ సమయంలో పురుషులు వేటకు త్వరగా బయలుదేరకపోవడంతో వారిపై మహిళలు రంగు నీళ్లు, పేడ నీళ్లు చల్లి వారిని వేటకు పంపుతారు.
కుక్కలతో కలసి వేటకు సిద్ధమైన గిరిజనులు
తొమ్మిది రోజుల్లోపు...
పురుషులతో పాటు గ్రామంలోని కుక్కలు సాయంగా వెళతాయి. అడవిలో కన్పించిన జంతువులను కుక్కలు నిలువరించడంతో వేటగాళ్లు దానిని సులభంగా వేటాడతారు. జంతువులు దొరికే వరకు వారు అడవిలోనే ఉండాలి. మూడు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. వారు తిరిగొచ్చే వరకు మహిళలు రహదారులపై నృత్యాలు చేస్తూ బాటసారుల నుంచి విరాళాలు సేకరిస్తారు. వేటాడిన జంతువును పూలదండలు వేసి ఘనంగా ఊరిలోకి తీసుకువస్తారు. దానిని గ్రామస్థులంతా కలసి వండుకుని తింటారు. ఇక్కడితో భూమి పండగ ప్రక్రియ పూర్తవుతుంది. తరువాత ఎవరికి ఏది అనుకూలం అనుకుంటే ఆ సాగుకు ఉపక్రమిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!