గోపాలకృష్ణ.. పచ్చదనంపై తృష్ణ
ఆయనకు పచ్చని వాతావరణమంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంటి ప్రాంగణమంతా మొక్కలతో నింపి ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగి నివాసి గుత్తా గోపాలకృష్ణ కొన్నేళ్ల నుంచి మొక్కలతో సుందరంగా తీర్చి దిద్దారు.
ఇంటి ప్రాంగణం ఆహ్లాదకరం
రాజవొమ్మంగి, న్యూస్టుడే
పంపర పనసను చూపుతూ...
ఆయనకు పచ్చని వాతావరణమంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంటి ప్రాంగణమంతా మొక్కలతో నింపి ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగి నివాసి గుత్తా గోపాలకృష్ణ కొన్నేళ్ల నుంచి మొక్కలతో సుందరంగా తీర్చి దిద్దారు. ఎటు చూసినా రకరకాల మొక్కలతో ఆవరణంతా నందన వనంలా కనిపిస్తోంది.
గుత్తా గోపాలకృష్ణ కృష్ణాజిల్లా మొవ్వ గ్రామానికి చెందిన వారు. ఈయన కుటుంబం సుమారు 50 ఏళ్ల క్రితం రాజవొమ్మంగి మండలం జడ్డంగి వచ్చి స్థిరపడింది. ఆయనకు చిన్ననాటి నుంచి మొక్కలంటే ఎంతో ఇష్టం ఉండటంతో పలు రకాల జాతులకు చెందిన మొక్కలను చిత్తూరు, కడియం ఇతర ప్రాంతాల నర్సరీల నుంచి తీసుకొచ్చేవారు. ఇంటి ప్రాంగణంలో ఔషధ, పూల, పండ్ల, సుంగధ ద్రవ్యాలు, పూజకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ నర్సరీలను చూసి కచ్చితంగా ఏదో ఒక మొక్క తెచ్చి ఇంటి ప్రాంగణంలో నాటడం అలవాటుగా చేసుకున్నారు. సుమారు ఎకరాన్నర స్థలంలో రకరకాల మొక్కలను పెంచుతున్నారు. సేంద్రియ ఎరువులు వాడుతూ మొక్కల సంరక్షణకు రూ. 25 వేల వరకు వెచ్చిస్తున్నారు. మొక్కలు కొన్ని చెట్లుగా ఎదగడంతో వాటికి కాసిన కాయలు, పండ్లను చూసి ఆయన మురిసిపోతుంటారు.
చలవజామ
పర్యావరణానికి మేలు
గోపాలకృష్ణకు వ్యవసాయమంటే మక్కువ కావడంతో వరి, కొబ్బరి సాగు కూడా చేపడుతుంటారు. ఇంట్లో నాటు కోళ్లను కూడా పెంచుతున్నారు. రోజు ఇంటికి వచ్చిన వెంటనే వాటి ఆలనాపాలనా చూస్తుంటారు. మొక్కల పెంపకానికి కొంత సమయం కేటాయిస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. భావితరాల మనుగడకు బంగారు బాటలు వేసే మొక్కలను పెంచడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతున్నారు.
పెంచుతున్న మొక్కలివే
* ఒక వైపు ఆకు కూరలు, మరో వైపు అవసరమైన కూరగాయలు పెంచుతున్నారు.
* పుష్పాలు: మల్లి, గులాబి, కనకాంబరం, మందారం, పూజకు ఉపయోగించే వివిధ జాతుల పుష్పాలు ఉన్న మొక్కలు.
* పండ్ల జాతి: పంపరపనస, మామిడి, నేరేడు, జంబో నేరేడు, బత్తాయి, పనస, జామ, చలవ జామ, కమల, నిమ్మ, నారింజ, అరటి, దానిమ్మ, చెరకు, సపోటా, జీడిగింజలు, సీతాఫలం, కాశీరేగు.
* ఔషధ జాతి: ఉసిరి, వేప, కలబంద, రావి, తమలపాకు, మారేడు, వెలగ, తెల్ల జిల్లేడు.
విరగకాసిన పనస
అందరూ ఉన్నత విద్యావంతులే..
రాజవొమ్మంగి: గోపాలకృష్ణ బీఏ (బీఎల్) చదివారు. ఆయన భార్య లీలావతి బీటెక్ చేశారు. వివాహ అనంతరం వారిద్దరు టెలిఫోన్ ఎక్స్ఛేంజీల కాంట్రాక్టు పనులు చేశారు. ఉన్నత విద్య చదివినా వ్యవసాయం అంటే ఇష్టంతో వరి, పత్తి ఇతర పంటలు సాగుచేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు ఎకరాన్నర స్థలంలో (ఇంటి ఆవరణలో) రకరకాల మొక్కలు పెంచుతున్నారు. వీళ్లకు ఇద్దరు సంతానం. కుమార్తె భావన కృష్ణ ఎంబీబీఎస్, పీజీ (రేడియాలజీ) చదివారు. ప్రస్తుతం బెంగళూరు ప్రైవేటు వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
* కుమారుడు కృష్ణ సాయిరాం. బిట్స్ పిలానీలో బీటెక్, ఎంఎస్సీ (బయాలజీ) పూర్తి చేసి పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా