కందిపప్పు చూస్తే కంగుతినాల్సిందే!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం డ్రైరేషన్ ద్వారా పంపిణీ చేసిన కందిపప్పును చూస్తే ఎవరైనా కంగుతినాల్సిందే. ఎందుకంటే ప్యాకింగ్పై ముద్రించిన గడువు తేదీ ముగిసినా ఇంకా కొన్ని పాఠశాలల్లో ఈ నిల్వలు కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ఎప్పుడు ప్యాకింగ్ చేసింది
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, నక్కపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం డ్రైరేషన్ ద్వారా పంపిణీ చేసిన కందిపప్పును చూస్తే ఎవరైనా కంగుతినాల్సిందే. ఎందుకంటే ప్యాకింగ్పై ముద్రించిన గడువు తేదీ ముగిసినా ఇంకా కొన్ని పాఠశాలల్లో ఈ నిల్వలు కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ఎప్పుడు ప్యాకింగ్ చేసింది కనిపించకుండా నల్లటి ఇంకుతో దిద్దడం నాణ్యతపై అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులకు పంపిణీ చేసే ఆహారం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఈ ప్యాకెట్లు చూస్తేనే తెలుస్తుంది.
ఏడాది ఆలస్యంగా పంపిణీ..
కొవిడ్ సమయంలో పాఠశాలలన్నీ మూతపడడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్థానంలో డ్రై రేషన్ పంపిణీ చేపట్టింది. 2020-21లో అయిదారు దశలుగా బియ్యం, గుడ్లు, పప్పులు అందజేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా పాఠశాలలు రెండు నెలలు ఆలస్యంగానే తెరుచుకున్నాయి. ఆ కాలానికి సంబంధించిన డ్రైరేషన్ అప్పుడు ఇవ్వకుండా విద్యా సంవత్సర ముగింపు సమయంలో పంపిణీ చేశారు. ఏడాది ఆలస్యంగా వీటిని అందించడమే కాకుండా కాలం చెల్లిన కందిపప్పును అంటగట్టడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. జగనన్న గోరుముద్ద పథకంలో కందిపప్పును కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా సరఫరా చేస్తుంటుంది. ఆ సంస్థ స్థానికంగా ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. వారు నాణ్యతతో కూడిన ఈ సరకును పాఠశాలలకు సకాలంలో అందజేస్తుండాలి. పర్యవేక్షణ లోపం కారణంగా నచ్చినప్పుడు వీటిని పాఠశాలలకు సరఫరా చేస్తుండడంతో సమస్యలు వెలుగుచూస్తున్నాయి.
ఓ పాఠశాలలో పంపిణీ చేయకుండా ఉన్న బస్తాలు
ప్యాకింగ్పై దిద్దుబాటు..
ఉమ్మడి జిల్లాలో 3,919 పాఠశాలల్లో 3.05 లక్షల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వీరందరికీ గతేడాది డ్రైరేషన్ ద్వారా 40 రోజులకు సరిపడా ఒక్కో విద్యార్థికి 2.5 కేజీల కందిపప్పును అందచేయాలి. వాటిని ఈ ఏడాది మార్చిలో సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఈ కందిపప్పు ప్యాకెట్లపై ప్యాకింగ్ తేదీ ఫిబ్రవరి/మార్చిగా ముద్రించారు. మూడు నెలల లోపు ఈ పప్పును వినియోగించుకోవడానికి మంచిదని ప్యాకింగ్పై పేర్కొన్నారు. అంటే మే లోగా ఈ పప్పుని వండుకుని తినేయాలి. తర్వాత ఉపయోగించడానికి అంత మంచిది కాదని అర్థం. అయితే వీటి నిల్వలను అన్ని పాఠశాలలకు మార్చి, ఏప్రిల్లో చేర్చలేదు. కొన్ని పాఠశాలలకు వేసవి సెలవులకు రెండు, మూడు రోజుల ముందు అందజేశారు. తొలుత సరఫరా అయిన పాఠశాలల్లో వీటిని పిల్లలకు సకాలంలోనే అందజేశారు. ఆఖరిలో పాఠశాలకు చేరిన కందిపప్పుని మాత్రం పిల్లలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో వీటి నిల్వలున్నాయి. అవన్నీ మూడు నెలలు కాలపరిమితి దాటిపోయినవే. పాఠశాలలకు కందిపప్పుని చేర్చడం ఆలస్యం అవుతుందని ముందే గ్రహించిన గుత్తేదారు ఆఖరిలో సరఫరా చేసిన ప్యాకెట్లపై ప్యాకింగ్ తేదీతో పాటు, ఎంత పరిమాణమో కనిపించకుండా నల్లని ఇంకు పూసేశాడు. దీంతో ఈ పప్పు నాణ్యతపైనే కాదు.. బరువుపైనా అనుమానించాల్సి వస్తోందని ఉపాధ్యాయులంటున్నారు. ఈ విషయమై మధ్యాహ్నభోజన పథకం విభాగం సూపరింటెండెంట్ జగన్నాథం వద్ద ప్రస్తావించగా, పిల్లలకు గడువు తేదీలోగానే కందిపప్పు అందించామని చెప్పారు. ప్యాకింగ్పై దిద్దుబాటు ఎలా వచ్చిందో తెలియదన్నారు. అనకాపల్లి డీఈవో లింగేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా సెలవులకు ముందుగానే పిల్లలకు అందజేయాలని సూచించామని, ఇంకా నిల్వలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!