logo

రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచి దుర్మరణం

చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తుమ్మల ఉప సర్పంచి నాగేశ్వరరావు (32) దుర్మరణం చెందారు. ఎస్సై యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఎటపాక మండలం జగ్గవరంలో శనివారం ఓ వివాహ వేడుకకు

Published : 03 Jul 2022 02:29 IST

చింతూరు, న్యూస్‌టుడే: చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తుమ్మల ఉప సర్పంచి నాగేశ్వరరావు (32) దుర్మరణం చెందారు. ఎస్సై యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఎటపాక మండలం జగ్గవరంలో శనివారం ఓ వివాహ వేడుకకు ద్విచక్రవాహనంపై నాగేశ్వరరావు, వినోద్‌, మరో వ్యక్తి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఏడుగురాళ్లపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్‌ కాలు విరిగింది. క్షతగాత్రుడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరొకరు క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని