logo

నిధుల్లేని సమావేశాలెందుకు: భాజపా

నిధులు లేకుండా పాలకవర్గ సమావేశాలు ఎన్ని పెట్టినా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని భాజపా జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

Published : 03 Jul 2022 02:29 IST

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు

పాడేరు, న్యూస్‌టుడే: నిధులు లేకుండా పాలకవర్గ సమావేశాలు ఎన్ని పెట్టినా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని భాజపా జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీడీఏలో అందుబాటులో ఉన్న నిధులను ప్రభుత్వం ఖాళీ చేసిందన్నారు. ఎస్టీ కార్పొరేషన్‌ నిధులు మళ్లించడం ద్వారా మూడేళ్లుగా ఒక్క గిరిజనుడికి రాయితీపై ఎటువంటి పరికరాలు అందించలేదన్నారు. గత పాలకవర్గంలో చర్చించిన సమస్యలు ఎన్ని పరిష్కరించారో తెలియజేయాలన్నారు. మన్యంలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి ఐటీడీఏకు భారీగా నిధులు వస్తున్నా, వాటిని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపా నాయకులు రాఘవేంద్రరావు, రామకృష్ణ, రవికుమార్‌, మత్స్యకొండబాబు, మోహన్‌రావు, అబ్బులు, హరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని