ఆదివాసీ వేడుకలకు సీఎం రానట్లే!
ఈ నెల తొమ్మిదో తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాడేరు పర్యటన ఎడతెరిపి లేని వర్షం కారణంగా రద్దయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
నిరంతర వర్షంతో పర్యటన రద్దు?
పాడేరు జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద సభా వేదిక
పాడేరు, న్యూస్టుడే: ఈ నెల తొమ్మిదో తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాడేరు పర్యటన ఎడతెరిపి లేని వర్షం కారణంగా రద్దయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రపంచ ఆదివాసీ వేడుకలను జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎంను ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సభావేదిక ఏర్పాటు చేయాలని భావించి శనివారం ఉదయం నుంచి పెండాల్స్ను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పాడేరు పట్టణ శివారులో వర్తనాపల్లి వద్ద హెలిప్యాడ్ నిర్మాణానికి సంబంధించి సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్లు నిర్మించేందుకు సంబంధిత సామగ్రిని శనివారం సాయంత్రానికి మైదానం నుంచి తీసుకొచ్చారు. మరో వైపు సీఎం పర్యటన రద్దవుతున్నట్లు సీఎంవో కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు అధికారులకు అధికారికంగా ప్రకటన అందలేదు. దీంతో ఏర్పాట్లను నిలిపేయాలా, కొనసాగించాలా, అనేది తేల్చుకోలేకపోతున్నారు. సీఎం పర్యటన రద్దుపై అధికారికంగా తెలపక పోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ఏ విధంగా తయారు చేయాలనే విషయంపై ఇంజినీర్లు డైలమాలో పడ్డారు. ఆర్అండ్బీ అధికారులు మాత్రం హెలిప్యాడ్ నిర్మాణ పనులు నిలిపేశారు.
రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు తెచ్చిన బ్యారికేడ్లు
ఉప ముఖ్యమంత్రుల రాక ఖరారు
ప్రపంచ ఆదివాసీ వేడుకలకు సీఎం హాజరు కాకపోయినా ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు హాజరు కానున్నట్లు అధికారులకు సమాచారం అందింది. వేడుకలకు వీరితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అమర్నాథ్ రానున్నట్లు తెలిసింది. దీంతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీఓ పర్యవేక్షిస్తున్నారు.
హెలిప్యాడ్ కోసం సిద్ధం చేసిన సిమెంట్, కంకర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ