అల్లూరి పంచాయితీలు నడిపింది.. ఇక్కడే!
బ్రిటీష్ దొరల అణిచివేత, దోపిడీ నుంచి గిరిజనులకు విముక్తి కలిగించడం లక్ష్యంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేపట్టారు. ఆ యోధుని స్మృతులను అడుగడుగునా సంతరించుకున్న ప్రాంతం కృష్ణదేవిపేట. అల్లూరి అప్పట్లో న్యాయ పంచాయితీలు నిర్వహించేవారు.
నర్సీపట్నం గ్రామీణం, కృష్ణదేవిపేట, న్యూస్టుడే
పాత కృష్ణదేవిపేటలో అల్లూరి పంచాయితీ నడిపిన చోట స్మారక మందిరం
బ్రిటీష్ దొరల అణిచివేత, దోపిడీ నుంచి గిరిజనులకు విముక్తి కలిగించడం లక్ష్యంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేపట్టారు. ఆ యోధుని స్మృతులను అడుగడుగునా సంతరించుకున్న ప్రాంతం కృష్ణదేవిపేట. అల్లూరి అప్పట్లో న్యాయ పంచాయితీలు నిర్వహించేవారు.
పాత కృష్ణదేవిపేటలో బండమీద కూర్చుని సీతారామరాజు న్యాయ పంచాయితీలు నిర్వహించే ప్రదేశంలో స్థానికులు స్మారక మందిరాన్ని నిర్మించారు. విగ్రహాన్ని గాం మల్లుదొర ఆవిష్కరించారు. 1917లో విశాఖ మన్యం చేరుకున్న సీˆతారామరాజుకు కృష్ణదేవిపేటకు చెందిన చిటికెల భాస్కరనాయుడు తల్లిగారు అప్పట్లో కొన్నాళ్లు ఆతిథ్యం ఇచ్చారు. 1922 ఆగస్టు 22న కృష్ణదేవిపేట నీలకంఠేశ్వర ఆలయం వద్ద నుంచే అల్లూరి సమరభేరి మోగించారు. దాడి చేసే ముందు మిరపకాయ చుట్టిన బాణంతో బ్రిటీష్ దొరలకు హెచ్చరికలు పంపి వారికి తెల్లవారికి సింహస్వప్నమయ్యారు. చింతపల్లి పోలీసు స్టేషన్పై దాడితో ఆరంభమైన మెరుపుదాడులు కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల తదితర చోట్ల కొనసాగాయి. 1924 మేలో నిరాయుధుడైన అల్లూరిని మేజర్ గుడాల్ కర్కశంగా కాల్చిచంపాడు. దేశభక్తితో సాగిన మన్యం పితూరీ ఈ ప్రాంతంలోని అనేకమందిలో పౌరుషాగ్ని రగిలించింది. నేటికీ అనేకమంది ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటారు. ఈ వీరుని సమాధిని కృష్ణదేవిపేటలోనే నిర్మించారు. ఇప్పుడిది సందర్శనీయ స్థలంగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఉద్యానంగా అభివృద్ధి చేశారు.
ఎ.ఎల్.పురంలో బొడ్డేరు నది పక్కన అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుడు
గంటందొర సమాధులు
ఉత్తరాలు చదివేసి.. కాల్చేసేదిక్కడే!
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే
స్వాతంత్య్ర పోరాటం సాగే రోజుల్లో గిరిజనులకు మేలు జరిగే కీలక ఉత్తరాలను వారికి చేరకుండా దహనం చేసేందుకు బ్రిటిష్ అధికారులు చింతపల్లిలో ఓ స్తూపం ఏర్పాటుచేశారు. మన్యం ప్రాంతానికి వచ్చే ఉత్తరాలు, కీలక పత్రాలు బ్రిటిష్ వారు చదివిన అనంతరం, వాటిని బహిర్గతం చేయకుండా ఈ స్తూపంలో పడేసి కాల్చేసేవారు. ఇప్పటికీ ఈ స్తూపం చింతపల్లి పోలీస్స్టేషన్ పక్కన చెక్కుచెదరకుండా ఉంది.
సమర యోధుల స్తూపం
స్వాతంత్య్ర సమరయోధుల సంస్మరణార్థం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద స్మారక స్తూపాన్ని నెలకొల్పి యోధుల పేర్లను లిఖించారు. అల్లూరి సీతారామరాజు వెన్నంట నడిచిన టగ్గి వీరయ్యదొర, గబులంగి సింగన్నదొర, కంకిపాటి శరబన్న పడాల్, ముత్తాడం వీరయ్యదొర, గబులంగి లక్ష్మయ్య, కంకిపాటి పెంటన్నపడాల్ పేర్లు ఈ స్తూపంపై ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..