పడిపోయిన పండ్ల వాణిజ్యం
మండలంలోని చిట్రాళ్లగుప్పుకు పండ్ల వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది చిన్న గ్రామమే అయినా ఇక్కడ ఏటా కోట్లాది రూపాయల పండ్ల వ్యాపారం జరుగుతోంది. రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా పండ్ల వ్యాపారం దెబ్బతింది.
ఎగుమతులకు నోచుకోని మన్యం పనస
చింతపల్లి, న్యూస్టుడే: మండలంలోని చిట్రాళ్లగుప్పుకు పండ్ల వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది చిన్న గ్రామమే అయినా ఇక్కడ ఏటా కోట్లాది రూపాయల పండ్ల వ్యాపారం జరుగుతోంది. రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా పండ్ల వ్యాపారం దెబ్బతింది. ఈ ఏడాది వర్షాలు, వ్యాధుల భయం ఈ వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ఉద్యాన పంటలను నమ్ముకున్న రైతులతోపాటు చిరువ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు.
* ఏటా ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరువరకూ సుమారు ఐదు నెలలపాటు చిట్రాళ్లగుప్పులో పండ్ల వ్యాపారం సాగుతుంది. మే నుంచి జులై వరకూ ఈ వ్యాపారం ముమ్మరంగా ఉంటుంది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు, పెదబరడ, లంబసింగి పంచాయతీలకు ప్రధాన కూడలిగా ఉన్న చిట్రాళ్లగుప్పు పండ్ల వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ పంచాయతీల్లోని అధిక సంఖ్యలో గిరిజనులు ఉద్యాన పంటలు పండిస్తుంటారు. మామిడి, పనస, అనాసపనస వంటి పంటల ఉత్పత్తులతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడేది. రెండేళ్లపాటు కరోనా మహమ్మారి కారణంగా దూరప్రాంతాల నుంచి వ్యాపారులు ఈ ప్రాంతానికి రావడం మానేశారు. దీంతో రెండేళ్లపాటు ఈ వ్యాపారం పడకేసింది. ఈ ఏడాదైనా వ్యాపారం పుంజుకుంటుందని చిరువ్యాపారులు, గిరిజనులు భావించినా వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఈ ఏడాది మన్యంలో రుతుపవనాలకంటే ముందుగానే వర్షాలు ప్రారంభం అయ్యాయి. మే నెల నుంచే వర్షాలు ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా వ్యాపారులూ రావడం తగ్గించారు. ఈ ప్రభావం ఎగుమతులపై పడింది. ఏటా సీజనులో ఇక్కడ సుమారు రూ.మూడు కోట్ల వరకూ పండ్ల వాణిజ్యం జరుగుతుంది. అటువంటిది ఈ ఏడాది రూ.కోటికి మించి వ్యాపారం జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాలతో దోమల బెడద కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. పండ్ల క్రయవిక్రయాలు, వినియోగం బాగా తగ్గాయి. దీంతో ఈ ఏడాది సీజను ముగుస్తున్నా పండ్ల వ్యాపారం మందకొడిగా సాగుతోందని ఇటు వ్యాపారులు, గిట్టుబాటు ధరలు రావడం లేదని గిరిజనులు వాపోతున్నారు.
వ్యాధుల విజృంభణ
చింతపల్లి మండలంలో మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. మన్యంలో లభించే పనస, అనాసపనస వంటి పండ్లను తిని వాటి వ్యర్థాలను ఇళ్ల పరిసరాల్లోనే వదిలేస్తుండటంతో అవి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించిన అధికారులు గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లు, గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. పరిమితికి మించి పనస, మామిడి, అనాసపనస వంటి పండ్లను తినవద్దని మరో వైపు వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు పండ్లను తినడం తగ్గించారు. వినియోగం తగ్గడంతో కేవలం ఎగుమతులపైనే ఆధారపడుతున్నారు. చిట్రాళ్లగుప్పులో పండ్ల వ్యాపారం అంతా జరుగుతుండటంతో ఇక్కడ సీజనులో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. వ్యాపారులు పాడయిన పండ్లను ఇక్కడే వదిలి వెళుతున్నారు. దీంతో అక్కడ దోమలు పెరిగి వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చిట్రాళ్లగుప్పులో వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. వ్యాపారాలు చేసుకునేవారు పరిసరాల శుభ్రతనూ పాటించాలని, రహదారులపై వ్యర్థాలను వదిలేసి వెళితే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. వ్యాపారం మందకొడిగా జరుగుతుండటంతో మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు ఈ ఏడాది చిట్రాళ్లగుప్పు రావడం తగ్గించారు. సీజను ప్రారంభం నుంచి ఈ ఏడాది పసస, మామిడి, అనాస పనస వంటి పండ్లకు ధరలు తగ్గాయి.
కొనుగోలుదారులు లేక గిరిజనుల ఇళ్లలోనే ఉండిపోయిన అనాస పనస
గిట్టుబాటు ధరలు రావడం లేదు
వ్యవసాయ పంటలకు దీటుగా ఉద్యాన పంటలను గిరిజనులు అధికంగా పండిస్తున్నారు. చిక్కుడుబట్టి, పెదబరడ, గొందిపాకలు, చినబరడ గ్రామాల్లో రైతులు ఏటా అనాసపనస, మామిడి, పనస పళ్ల అమ్మకాలపైనే ఆధారపడతారు. ఈఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా ఆశించిన గిట్టుబాటు ధరలు రావడం లేదు. పండిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఎటువంటి సదుపాయాలూ లేవు. గతంలో శీతల గిడ్డంగిని చిట్రాళ్లగుప్పు వద్ద నిర్మిస్తామని అధికారులు ప్రకటించారు. అది కార్యరూపం దాల్చితే గిరిజనుల ఉత్పత్తులు దాచుకుని ధరలు పెరిగాక అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది.
- అబ్బాయినాయుడు, రైతు, దిగువపాకలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్