జాగాలమామిడిలో అల్లూరి గుహ
స్వాతంత్య్ర సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయం. సాయుధ పోరాటంతో బ్రిటిష్వారిని గడగడలాడించారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో అల్లూరి పోరాట శైలి, స్థావరాల విశేషాలు తెలుసుకుందామా..
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే
స్వాతంత్య్ర సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయం. సాయుధ పోరాటంతో బ్రిటిష్వారిని గడగడలాడించారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో అల్లూరి పోరాట శైలి, స్థావరాల విశేషాలు తెలుసుకుందామా..
అల్లూరితోపాటు ఆయన అనుచరులు బ్రిటిష్వారికి దొరక్కుండా ఓ గుహను రక్షణగా వినియోగించుకున్నారు. గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డొకులూరు సమీపంలోని జాగాలమామిడి కొండపై సముద్ర మట్టానికి సుమారు 2 వేల అడుగుల ఎత్తులో పెద్ద బండరాయి చాటున ఈ గుహ ఉంది. డొకులూరు నుంచి కొయ్యూరు వైపు అడవి మార్గంలో వెళ్తే రెండున్నర కిలోమీటర్ల దూరంలో పెద్ద రాతికొండ ఉంది. దానిపై ఈ గుహ కనిపిస్తుంది. దీని చుట్టూ అల్లూరి ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గాం గంటన్నదొర, వీరయ్యదొర, గోకిరి ఎర్రేసు, పండుపడాల్, అగ్గిరాజు తదితరులు రాతికట్టుతో గోడ నిర్మించారని డొకులూరు గ్రామ పెద్దలు చెబుతుంటారు.
ఇక్కడి నుంచే పోలీస్స్టేషన్లపై దాడి
బండరాయికి, గుహకు మధ్య అల్లూరి సేన కట్టిన రాతిగోడ
గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల సరిహద్దు కొండపై ఉన్న ఈ గుహలోనే అల్లూరి సీతారామరాజు పూజలు చేసి సేనను దాడులకు పంపేవారని స్థానిక పెద్దలు చెబుతున్నారు. ఈ గుహ నుంచి కొయ్యూరు, మంప మీదుగా రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, చింతపల్లి ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారట. ఈ గుహను రక్షణ కవచంగా (షెల్టర్జోన్గా) వినియోగించుకుని రాజవొమ్మంగి, అడ్డతీగల, చింతపల్లి, కృష్ణదేవిపేట పోలీస్స్టేషన్లపై దాడులు చేశారు. తీసుకొచ్చిన ఆయుధాలను గుహలోనే దాచేవారని స్థానిక పెద్దలు చెబుతున్నారు. ఆంగ్లేయులకు చిక్కకుండా ఈ గుహ నుంచే అల్లూరి సేన పోరాటం చేసినట్లు పేర్కొంటున్నారు. ఎత్తైన కొండపై ఉండటం, గుహలో ఎలుగుబంట్లు, క్రూరమృగాలు ఉన్నాయని ప్రచారంలో ఉండటంతో దీనిని ఎక్కేందుకు ఎవరూ సాహసించలేదు.
వ్యూహాలకు అండ... ఉర్లకొండ
మంప సమీపంలోని ఉర్లకొండ గుహ ఇదే..
అల్లూరి సీతారామరాజు, ఆయన ముఖ్య అనుచరులు మంప సమీపంలోని ఉర్లకొండ గుహలో తరచూ సమావేశమవుతూ బ్రిటిష్వారిపై పోరాటానికి వ్యూహాలు రచించేవారు. ఈ గుహ నుంచి చూస్తే ఇతర ప్రాంతం నుంచి వచ్చే వారంతా రహదారులపై కన్పిస్తారు. శత్రువుల జాడను బట్టి ఇక్కడి నుంచి ప్రణాళికలు రూపొందించేవారు. ఈ గుహ నుంచి రహస్యమార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. సీతారామరాజు ఉర్లకొండ గుహను స్థావరంగా ఏర్పాటు చేసుకొని పోరాటం సాగించారు. అక్కడ నుంచి మంపలోని మడుగులో స్నానం చేస్తుండగా ఆంగ్లేయులకు చిక్కారు.
-కొయ్యూరు, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్