పరీక్ష తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి ఆదివారం విగతజీవిగా మారాడు. పట్టణ ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని కుంచంగి గ్రామానికి చెందిన పల్లెల చందు (17) ఇంటర్ పరీక్షల్లో తప్పాడు.
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి ఆదివారం విగతజీవిగా మారాడు. పట్టణ ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని కుంచంగి గ్రామానికి చెందిన పల్లెల చందు (17) ఇంటర్ పరీక్షల్లో తప్పాడు. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఉత్తీర్ణుడు కాకపోవడంతో మనస్తాపానికి గురై ఎన్టీఆర్ క్రీడామైదానం వద్ద ఆగస్టు 30న పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. తండ్రి నర్సింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మాడుగుల గ్రామీణం, న్యూస్టుడే: సాగరం కాలనీ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిందని ఎస్సై దామోదరనాయుడు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన బొడ్డేటి నాగయ్యమ్మ (59) ఆదివారం వంట్లమామిడిలో జరిగే వారపు సంతకు వెళ్లి ఆటోలో వస్తోంది. ఈ సమయంలో ఆటో నుంచి జారిపడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ తలారి ఏసుబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
విద్యుదాఘాతంతో కార్మికుడు..
చోడవరం పట్టణం: భవన నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందాడు. ఎస్సై యమున కథనం ప్రకారం.. చెట్టుపల్లికి చెందిన పాతాళం వెంకటరమణ (27) అన్నవరం గ్రామంలో శనివారం రాత్రి భవన నిర్మాణ పనులకు హాజరయ్యాడు. పనుల్లో భాగంగా ఇనుప ఊచలను హ్యాండ్ కట్టర్తో కోస్తుండగా విద్యుత్తుఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటరమణకు భార్య నిరీష, నాలుగేళ్ల కుమారుడు జశ్వంత్, ఏడాదిన్నర పాప జ్ఞానేశ్వరి ఉన్నారు. నిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.