అనూహ్యం.. అనూషాకు అవకాశం!
వంతల బాబూరావు ఎంపీపీ పదవి కోల్పోవడానికి సొంత పార్టీలో విభేేదాలే కారణమని చర్చ జరుగుతోంది. గత ఏడాది సరిగ్గా సెప్టెంబరు 29న చింతపల్లిలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వైకాపాకు మెజారిటీ ఉన్నా పార్టీలో అసమ్మతి సెగల కారణంగా లాటరీలో బాబూరావుకు పదవి వరించింది. ఇప్పుడు అదే పదవి సొంత పార్టీ నేతల
చింతపల్లి/గ్రామీణం, న్యూస్టుడే:
గత ఏడాది లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి
వంతల బాబూరావు ఎంపీపీ పదవి కోల్పోవడానికి సొంత పార్టీలో విభేేదాలే కారణమని చర్చ జరుగుతోంది. గత ఏడాది సరిగ్గా సెప్టెంబరు 29న చింతపల్లిలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వైకాపాకు మెజారిటీ ఉన్నా పార్టీలో అసమ్మతి సెగల కారణంగా లాటరీలో బాబూరావుకు పదవి వరించింది. ఇప్పుడు అదే పదవి సొంత పార్టీ నేతల కారణంగా పోయింది. మండలంలో మొత్తం 20 సెగ్మెంట్లకు వైకాపా పది, తెదేపా 1, కాంగ్రెస్ 2, సీపీఐ 1 స్ధానాల్లో గెలుపొందగా స్వతంత్రులు ఆరు స్ధానాల్లో విజయం సాధించారు. ఎంపీపీ పదవికి మొదటి నుంచి రెండు సామాజికవర్గానికి చెందిన నాయకులు పోటీ పడ్డారు. వీరిలో తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనూషాదేవి, బాబూరావు ఉన్నారు. ఎంపీపీ ఎన్నికకు వైకాపాకు పది మంది సభ్యులున్నప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. సొంత పార్టీలోనే అసంతృప్తులు, వ్యతిరేకులు ఉండటంతో పోటీ ఏర్పడింది. వైకాపా అధిష్ఠానం అనూషాదేవికి బీఫాం ఇచ్చింది. దీంతో ఆమె ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈమె అభ్యర్థిత్వాన్ని సీపీఐ తరపున పోటీచేసి గెలుపొందిన ఎర్రబొమ్మలు ఎంపీటీసీ సభ్యుడు సెగ్గె సత్తిబాబు ప్రతిపాదించారు. అంజలీశనివారం ఎంపీటీసీ సభ్యుడు సాగిన వెంగళరావు బలపరిచారు. చేతులెత్తే పద్ధతిలో మొత్తం పదిమంది సభ్యులు అనూషా దేవికి మద్దతు తెలిపారు. బలపం, లోతుగెడ్డ, చింతపల్లి-1, చింతపల్లి-2, చౌడుపల్లి, ఎర్రబొమ్మలు, లంబసింగి, కిటుముల, అంజలీశనివారం ఎంపీటీసీ సభ్యులు వీరిలో ఉన్నారు. వైకాపా అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీలో నిలిచిన బాబూరావును అన్నవరం ఎంపీటీసీ సభ్యుడు కొర్రా సూరిబాబు ప్రతిపాదించగా పెదబరడ ఎంపీటీసీ సభ్యుడు పొట్టిక లోవరాజు బలపరిచారు. బాబూరావుకు కుడుముసారి, తమ్మంగుల, అన్నవరం, బెన్నవరం, కొత్తపాలెం-1, కొత్తపాలెం-2, కొమ్మంగి, పెదబరడ, గొందిపాకలు ఎంపీటీసీ అభ్యర్థులు మద్దతు తెలిపారు. ఎంపీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న ఇద్దరికీ చెరో పది మంది ఓటేయడంతో అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ నిబంధనల ప్రకారం లాటరీ వేయగా బాబూరావు పేరు వచ్చింది. దీంతో ఈయన్ను ఎంపీపీగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. వైకాపాకు ఎంపీపీ పదవి చేపట్టేందుకు సొంతంగానే మెజారిటీ ఉన్నా వర్గపోరు కారణంగా లాటరీ వరకూ వెళ్లింది. అప్పటి నుంచి అధిష్ఠానం ఎంపీపీ బాబూరావుపై గుర్రుగా ఉంది. ఆ తరువాత కొద్దికాలంపాటు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆయనపై పార్టీ సీరియస్గానే ఉంది. ఇప్పుడు ఇదే ఆయన పదవి కోల్పోవడానికి కారణం అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాట కాదని ఎంపీపీగా ఎన్నికవడంతోనే తనపై కక్షకట్టి అంతర్గతంగా కుట్రలు చేస్తున్నారని ఇటీవల బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.
* చింతపల్లి ఎంపీపీ విషయంలో మొదటి నుంచీ అనూహ్య పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. గతంలో పాడేరు ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి ఉన్న సమయంలో ప్రభుత్వం జారీ చేసిన విప్ను ధిక్కరించడంతో అప్పటి ఎంపీపీ కవడం మచ్చమ్మ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాబూరావు విషయంలోనూ అదే జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్