వ్యాన్ బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు
మాడుగుల - పాడేరు ఘాట్ రోడ్డులో వంట్లమామిడి - తాటిపర్తికి మధ్య వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామానికి చెందిన 12 మంది మహిళలు భవానీ మాలలు ధరించారు. పాడేరులోని మోదకొండమ్మ
మాడుగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి, నాగభూషణం, వెంకటలక్ష్మి
మాడుగుల, న్యూస్టుడే: మాడుగుల - పాడేరు ఘాట్ రోడ్డులో వంట్లమామిడి - తాటిపర్తికి మధ్య వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామానికి చెందిన 12 మంది మహిళలు భవానీ మాలలు ధరించారు. పాడేరులోని మోదకొండమ్మ దర్శనానికి గురువారం ఉదయం బొలెరో వ్యాన్లో బయలు దేరారు. పాడేరులో అమ్మవారి దర్శనం ముగించుకుని తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఘాట్ రోడ్డు దిగుతుండగా వంట్లమామిడి -తాటిపర్తికి మధ్య వ్యాన్ ముందు టైరు పేలిపోయింది. దీంతో వ్యాన్ బోల్తా పడింది. ఈ సంఘటనలో కుర్రు లక్ష్మి, బోడి నాగభూషణం, గొంప వెంకట లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురికి మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలిస్తునట్లు వైద్యులు లావణ్య, శ్రీలక్ష్మి తెలిపారు. మరో యువకుడు పెదిరెడ్ల సుబ్రహ్మణ్యంకు స్వల్ప గాయమైంది ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. డ్రైవర్ పెద్దిరెడ్ల హనుమంతు మాట్లాడుతూ ఈ మధ్యనే వ్యాన్ కొన్నాను. టైర్లు నాలుగు కొత్తవే. ఎలా పేలిపోయిందో తెలియడం లేదన్నాడు. ఇతను క్షేమంగానే ఉన్నాడు. వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో చెట్టు అడ్డుకోకపోతే తామంతా భారీ లోయలోకి పడి పోయే వారమని భవానీమాతలు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారందరిని 108 అంబులెన్స్లో మాడుగుల ఆసుపత్రికి సకాలంలో తీసుకుని వచ్చి వైద్యసేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్