logo

కలువ పూలు కొయ్యబోయి.. నిండుప్రాణం బలి

భవాని దీక్షలో ఉన్న భార్య కోరడంతో కలువ పూలు కోసేందుకు చెరువు వద్దకు వెళ్లిన భర్త ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయిన ఘటన నర్సీపట్నం మండలం ఆర్డనరీ లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. ఆరిపాక వెంకటరమణ (74) బార్బరుగా పనిచేస్తూ

Published : 30 Sep 2022 00:53 IST

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: భవాని దీక్షలో ఉన్న భార్య కోరడంతో కలువ పూలు కోసేందుకు చెరువు వద్దకు వెళ్లిన భర్త ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయిన ఘటన నర్సీపట్నం మండలం ఆర్డనరీ లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. ఆరిపాక వెంకటరమణ (74) బార్బరుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య సత్యవతి దుర్గాదేవి భక్తురాలు. భవానిమాల ధరించి దీక్ష చేస్తోంది. పూజకు అవసరమైన కలువ పూలు స్థానిక పెద్దచెరువు నుంచి సేకరించేందుకు బుధవారం సాయంత్రం వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో వృద్ధుడు మృతదేహం చెరువులో తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని