ఉద్యానానికి ఊతం
అల్లూరి సీతారామరాజు ఉద్యాన రైతులకు మంచి రోజులు రానున్నాయి. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి వీలుగా శీతల గోదాంల నిర్మాణానికి ఉద్యాన శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. పండిన పంటలు మద్దతు ధర లభించని పక్షంలో నిల్వ చేసుకునేందుకు ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు.
న్యూస్టుడే, పాడేరు
గెడ్డంపుట్టులో సరకు సేకరణ కేంద్రం స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఉద్యానాధికారి రమేష్
అల్లూరి సీతారామరాజు ఉద్యాన రైతులకు మంచి రోజులు రానున్నాయి. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి వీలుగా శీతల గోదాంల నిర్మాణానికి ఉద్యాన శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. పండిన పంటలు మద్దతు ధర లభించని పక్షంలో నిల్వ చేసుకునేందుకు ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న గోదాంలకు తరలించడానికి రవాణా భారం రైతుల మీదే పడేది. ఇప్పుడు శీతల గిడ్డంగులు, సరకు సేకరణ కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్య తీరనుంది.
జిల్లా పరిధిలో ఎక్కువగా పసుపు, ఎండు మిర్చి, అల్లం, పైనాపిల్, సీతాఫలాలు, అరటి పంటలతోపాటు వివిధ రకాలైన కూరగాయలు పండిస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే పదకొండు మండలాల్లో కాఫీ, మిరియాలతోపాటు పసుపు, పైనాపిల్, సీతాఫలాలు, మామిడి, జాక్ఫ్రూట్ వంటి పంటలు పండిస్తుండగా... రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పదకొండు మండలాలు జీడిమామిడి, మిర్చి వంటి పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ పండే బంగాళదుంపలు, నాగలి దుంపలు, బస్తర్లు, రాజ్మా వంటివి ఒడిశా, ఛత్తీస్గఢ్తోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఉద్యాన పంటలు నిల్వ చేసుకునే అవకాశం ఎక్కడా లేదు. ఈ కారణంగా మద్దతు ధర వచ్చేవరకు వేచి ఉండలేని పరిస్థితి ఉంది. వారపు సంతల్లో ఆ రోజు ఉన్న ధరలకు సరకు విక్రయించడం తప్ప రైతుకు వేరేదారి లేకుండా పోతోంది. దీంతో కొన్నిసార్లు పెట్టుబడి సైతం దక్కక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మాత్రం తమ సొంత ఖర్చులతో మైదాన ప్రాంతాలకు తరలించి పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల రైతుపై అదనపు భారం పడుతోంది.
* రైతులకు తోడ్పాటునిచ్చే చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 30 సరకు సేకరణ కేంద్రాలు (కలెక్షన్ సెంటర్స్), పది శీతల గిడ్డంగులు మంజూరయ్యాయి. ఒక్కో దానికి రూ.15 లక్షలు కేటాయించారు. ఇందులో స్థానిక రైతు ఉత్పత్తి సంఘాలు 25 శాతం భరించాల్సి ఉంటుంది. 75 శాతం రాయితీ లభించనుంది. సరకు సేకరణ కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
అధిక ప్రయోజనం..
సరకు నిల్వ, సేకరణ కేంద్రాలు లేకపోవడంతో ఉద్యాన పంటలను ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉంటే అంతే ధరకు మధ్య దళారీలకు విక్రయించేవారు. దీంతో రైతుకు లాభం వచ్చే అవకాశం తక్కువ. కొన్ని సమయాల్లో పెట్టుబడి తిరిగి రావడమూ కష్టమే. ఈ పరిస్థితులను అధిగమించేలా సరకు సేకరణ కేంద్రాలు, సరకు ఎక్కువ నిల్వ చేసేలా ఉండేందుకు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయనున్నా. పండించిన పంటలను మార్కెట్లో ఎక్కువ ధర లభించే వరకు నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
- రమేష్, జిల్లా ఉద్యానాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!