logo

పార్టీ బలోపేతానికి పాటుపడండి

తెదేపా బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిన్నం బాబూరమేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల బూత్‌ కమిటీ ఇన్‌ఛార్జులతో సమావేశం జరిగింది.

Published : 04 Oct 2022 02:38 IST


సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి

రంపచోడవరం, న్యూస్‌టుడే: తెదేపా బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిన్నం బాబూరమేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల బూత్‌ కమిటీ ఇన్‌ఛార్జులతో సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటినుంచే కృషి చేయాలన్నారు. తెదేపా మండలాధ్యక్షులు కారం సురేష్‌బాబు, గురుకు శేషుకుమార్‌, మరిచెట్ల వెంకటేశ్వరరావు, నాయకులు జె.ఎస్‌ నగేష్‌, కారం సింహాచలం, మాగాపు బాబూరావు, బీశెట్టి అప్పాజి, సాధల సత్య, అనంతమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

* అడ్డతీగలలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం, వై.రామవరం మండలాలకు చెందిన తెదేపా నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. ముఖ్యఅతిథిగా నియోజకవర్గ పరిశీలకులు యర్రా వేణుగోపాలరాయుడు హాజరవుతారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని