పుడమి విశేషాల కలిమి
భూమి.. మానవాళికి అవసరమైన అన్నింటినీ సమకూర్చే వనరు. ఎన్నో వింతలు, విచిత్రాలకు వేదిక. ప్రాంతాన్ని బట్టి వైవిధ్యభరితంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరంగా చూస్తే ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
రేపు అంతర్జాతీయ భూవైవిధ్య దినోత్సవం
కోట్లాది సంవత్సరాల కిందటి కీటకాలు, ఆల్చిప్ప
పాయకరావుపేట, న్యూస్టుడే: భూమి.. మానవాళికి అవసరమైన అన్నింటినీ సమకూర్చే వనరు. ఎన్నో వింతలు, విచిత్రాలకు వేదిక. ప్రాంతాన్ని బట్టి వైవిధ్యభరితంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరంగా చూస్తే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. బంగారు వర్ణంతో మెరిసే ఇసుక తిన్నెలతో హొయలు ఒలకబోసే తీర ప్రాంతం, ఎర్రమట్టి దిబ్బలు, బొర్రా గుహలు ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ చూడదగిన ప్రదేశమే. అంతే కాదండోయ్.. బాక్సైట్, లేటరైట్ లాంటి ఖనిజాలు, గొలుగొండ మండలం కరక ప్రాంతాల్లో రంగురాళ్ల కొండల సమాహారంతో అలరారుతోంది. గురువారం అంతర్జాతీయ భూవైవిధ్య దినోత్సవం. ఈ సందర్భంగా ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
శిలాజాలు.. వయసు ఘనం
కోట్లాది సంవత్సరాల కిందట భూమిపై నడయాడిన రాక్షస బల్లులు (డైనోసార్లు) అంతరించిపోయిన విషయం తెలిసిందే. ఆ ఆనవాళ్లు ఇప్పుడు దొరికితే చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతాం. చేపలు, కీటకాలు, ఆల్చిప్పలు, వృక్షాలకు సంబంధించి శిలాజాల రూపంలో లభ్యమైతే ఆ ఆనందమే వేరు. ఇవన్నీ దొరకాలంటే భూమే ఆధారం. తవ్వకాల్లో అడపాదడపా శిలాజాలు బయటపడుతూ నాటి చరిత్రను కళ్ల ముందుంచుతున్నాయి. భూమిలో కూరుకుపోయిన వృక్షాలు, ఇతర అవశేషాలు కోట్లాది సంవత్సరాలపాటు జరిగిన రసాయన చర్యల ఫలితంగా ఇంధనంగా మారుతున్న విషయం విదితమే. కోనసీమ ప్రాంతంలో దొరుకుతున్న గ్యాస్, ఆయిల్ నిక్షేపాలే ఇందుకు తార్కాణం. తీరప్రాంతంలో దొరికే ఇసుకలో విలువైన ఖనిజాలున్నాయని తేలడంతో నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేటలో పరిశ్రమను ఏర్పాటు చేశారు. కొన్ని వివాదాల కారణంగా అక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.
చూడాలనుందా..
డైనోసార్ కాలి ఎముక, వాటి గుడ్డు ఎలా ఉంటుందో చూడాలనుందా.. అయితే పాయకరావుపేట రండి. దక్కన్ పరిశ్రమలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్న కందుల వెంకటేష్ ఇలాంటివి ఎన్నో సేకరించి భద్రపరుస్తున్నారు. కోట్లాది సంవత్సరాల కిందట మట్టిలో కప్పబడిన జీవులు, చెట్ల ఆకులు, బెరడు భూమిలోపల మట్టితో కలిసి యథాతథంగా రాళ్లుగా మారి శిలాజాలుగా రూపొందుతాయనే విషయం తెలిసిందే. డైనోసార్ ఎముకలు, కాలి భాగాలను ఆయన సేకరించారు. తెలంగాణాలోని గోదావరి, ప్రాణహిత బేసిన్లో ఇవి లభ్యమయ్యాయని చెబుతున్నారు. బొద్దింకలను పోలి ఉండే కీటకాలు, చేప, ఆకులు, సముద్ర జీవులు, నత్తలు తదితర శిలాజాలను సేకరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వాటిని సేకరించారు. శిలాజాలుగా మారిన డైనోసార్ గుడ్లు వెంకటేష్ వద్ద ఉన్నాయి. పునాదులు, బావులు, లోతైన గుంతలు, కాలువలు తవ్విన చోట్ల ఆయన శిలాజాల కోసం వెతుకుతుంటారు. శిలాజాలన్నీ 5.5 కోట్ల ఏళ్ల కిందటివి కావడం విశేషం.
భూవైవిధ్యంపై అవగాహన తప్పనిసరి
భూవైవిధ్యంపై అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలి. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా ఆసక్తిని పెంచుతున్నాం. చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ల కోసం నిరంతరం శ్రమిస్తున్నా. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నా. - కందుల వెంకటేష్,
శిలాజంగా మారిన చేప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
పేటలో అధికం.. మాడుగులలో అత్యల్పం
[ 28-03-2024]
జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం ఓటర్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు. -
‘ఆధారాలు లేకుండా సరెండర్ చేస్తారా?’
[ 28-03-2024]
విధినిర్వహణలో ఎంతో శ్రమించి ఉద్యోగాలు చేస్తున్న తమను ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు లేకుండా రంపచోడవరం వెలుగు ఏపీడీ కార్యాలయానికి సరెండర్ -
అధికార దాహం.. అదుపులేని ప్రచారం!
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వ ప్రచారానికి అంతు లేకుండా పోతోంది. విద్యార్థులకిచ్చే పాఠ్యపుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరకు అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పాలప్యాకెట్లు, పోషకాహారం, చిక్కీలను సైతం తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 28-03-2024]
ఎంపీగా కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేగా శిరీషారాణిల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
వదలని రంగుల పిచ్చి!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా గ్రామాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. -
మొన్న వైకాపా... నేడు తెదేపా
[ 28-03-2024]
చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు. -
పార్టీని విమర్శించే అర్హత వారికి లేదు
[ 28-03-2024]
జనసేన పార్టీని, నేతలను విమర్శించే హక్కు పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. -
తాడిని తరలించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 28-03-2024]
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు. -
వైకాపా ప్రచారంలో వాలంటీర్లు
[ 28-03-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఒడిశాలో తెదేపా నాయకుల ప్రచారం
[ 28-03-2024]
నక్కపల్లి మండలానికి చెందిన తెదేపా, జనసేన, భాజపా మత్స్యకార నాయకులు ఒడిశాలో బుధవారం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. -
ప్రభుత్వం మారకపోతే సామాన్యులకు ఇబ్బందులు
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా అరకు పార్లమెంట్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకురి శేఖర్ అన్నారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
[ 28-03-2024]
నక్కపల్లి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.దుర్గాభవాని విధులు నిర్వహిస్తూ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.50వేల చెక్ను అందజేశారు. -
జనసేనలోకి వైకాపా నేత
[ 28-03-2024]
ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
సెజ్ కంపెనీ ప్రమాదంలో మరో కార్మికుడి మృతి
[ 28-03-2024]
సెజ్ సింబయో కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు