ఆట.. కొలువుల బాట
విద్యాలయాలలో ఆటలు ఓ భాగం. ఇవి నేర్చుకున్నాక పోటీల్లో ప్రావీణ్యం చూపితే, అక్కడే వీక్షకుల ప్రశంసలు, అభిమానం పొందుతారు.
ఉపాధ్యాయులుగా ఎంపికైన క్రీడాకారుల స్ఫూర్తిమంత్రం
వరరామచంద్రాపురం, న్యూస్టుడే
విద్యాలయాలలో ఆటలు ఓ భాగం. ఇవి నేర్చుకున్నాక పోటీల్లో ప్రావీణ్యం చూపితే, అక్కడే వీక్షకుల ప్రశంసలు, అభిమానం పొందుతారు. ఇలా ప్రతిభ కనబర్చుతూ, క్రీడల్లో ముందుకు సాగితే, చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో 2018 డీఎస్సీలో క్రీడా విభాగంలో ప్రతిభతో ఎనిమిది మంది అర్హత సాధించారు. కొందరు డీఎస్సీ అభ్యర్థులు న్యాయస్థానం వరకు వెళ్లడంతో పాటు కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా పోస్టింగ్లు ఇవ్వడం ఆలస్యమైంది. తీర్పు వెలువడటంతో ఈనెల మొదటి వారం నుంచి వీరందరికి పోస్టింగ్లు ఇచ్చారు. సరదాగా ఆడిన ఆటలు వారి భవిష్యత్తుకు అండగా, ఉద్యోగ అవకాశాలకు సోపానంగా మారడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ప్రధానంగా రంపచోడవరం మన్యం నుంచి ఐదుగురు ఎంపికవ్వడం విశేషం.
పరుగుల దొర
రంపచోడవరానికి చెందిన యాదిద్యా దొర వ్యవసాయ ఆధారిత కుటుంబానికి చెందినవాడు. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్ను దూర విద్యా విధానంలో పూర్తిచేశారు. గోకవరంలో డైట్ కళాశాలల్లో శిక్షణ పొందారు. పాఠశాలలో, కళాశాలల్లో 100 మీటర్ల పరుగు, హర్డిల్స్ పరుగులో ప్రావీణ్యం చూపారు. ఇదే ఉపాధి మార్గమైంది. ప్రస్తుతం ఈయన సొంత మండలంలోని సీడిపాలెంలో గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
పవన్కల్యాణ్
వీఆర్పురం మండలానికి చెందిన పవన్కల్యాణ్ ఫెన్సింగ్లో ప్రతిభ చూపేవారు. ఇదే మండలంలోని చింతరేవుపల్లి పాఠశాలలో ఎస్జీటీగా కొలువు సాధించారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలు చెబుతున్న దొర
దుర్గమ్మ (రెజ్లింగ్), కె.శ్రీబాల (హాకీ), వి.రాజు (చదరంగం), డి.పవన్కల్యాణ్ (ఫెన్సింగ్), ఎస్.సంజీవరెడ్డి (ఫుట్బాల్), కె.యాదిద్యా దొర (పరుగులు), రమాదేవి (వాలీబాల్), ఎ.సుబ్బలక్ష్మి (ఫుట్బాల్) క్రీడాకోటాలో కొలువు సాధించిన వారిలో ఉన్నారు. వారి నేపథ్యాలు, స్ఫూర్తి ప్రస్థానంపై ‘న్యూస్టుడే’ కథనం..
వాలీబాల్.. రమా ఆయుధం
కూనవరం మండలం చూచిరేవులగూడెంకు చెందిన అనిగి రమాదేవి పదో తరగతి వరకు స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో చదివారు. ఇంటర్ సుదిమళ్లలోని ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాలలో, డిగ్రీని భద్రాచలంలో పూర్తిచేశారు. పాఠశాలలో, ఇంటర్లో వాలీబాల్ పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబర్చి దాదాపుగా నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె జీపీస్ కూనవరంలో ఉపాధ్యాయురాలిగా చేరారు.
ఫుట్బాల్తో గోల్ సాధించి..
రంపచోడవరానికి చెందిన సంజీవరెడ్డి పేద గిరిజన కుటుంబానికి చెందిన వాడే. మారేడుమిల్లి ఏపీఆర్ కళాశాలలో ఆరు నుంచి ఇంటర్ వరకు చదివారు. డిగ్రీ కాకినాడలో పూర్తి చేశారు. డైట్ రావులపాలెంలో చేశారు. పాఠశాలలో, ఇంటర్లో ఆడిన ఫుట్బాల్కు కాకినాడలో మరింత మెరుగులు దిద్దుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. దీని ఫలితంగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం దేవిపట్నం మండలంలోని దండంగిలో గిరిజన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
కండక్టర్గా చేస్తూ..
గంగవరం మండలంలోని గొరగొమ్ముకు చెందిన ఎ.సుబ్బలక్ష్మి వాలీబాల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఇంటర్వరకు చదివారు. డైట్ గోకవరంలో పూర్తి చేశారు. వెంటనే ఉద్యోగం రాకపోవడంతో ఆర్టీసీ కండక్టర్గా ఎంపికయ్యారు. కోర్టు తీర్పు అనంతరం మల్లవరం జీపీఎస్కు ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఆర్టీసీ ఉద్యోగాన్ని వదిలి ఉపాధ్యాయురాలిగా చేరతానని తెలిపారు.
చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే : ఆటలను తేలికగా కొట్టిపారేయకూడదు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపైన పట్టు సాధించాలి. అవి ప్రధానంగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలకు దారి చూపుతాయి. కళాశాల నుంచి టెక్నికల్ కోర్సులపైన విద్యార్థులు దృష్టి సారించాలి. ఆ ధ్రువ పత్రాలు ఉద్యోగాలు పొందడానికి సోపానాలుగా మారతాయి.
లక్ష్మీనారాయణ, ఎంఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా