ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పాడేరు ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు.
పాడేరులో ఆర్టీసీ డిపో గేటు ఎదుట నిరసన తెలుపుతున్నకార్మికులు, సీఐటీయూ నాయకులు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పాడేరు ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. డిపో కార్యదర్శి బి. వెంకటరావు మాట్లాడుతూ 2017 పే ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, ఓటీ, డే అవుట్ అలవెన్సులను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. అద్దె బస్సులు వద్దని, ఆర్టీసీ సంస్థ బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఆర్టీసీలో వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. పదోన్నతి పొందిన ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు టి.ఆర్.లింగం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రభుదాస్, వరహాలు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sarfaraz: సర్ఫరాజ్ మా దృష్టిలోనే ఉన్నాడు: బీసీసీఐ
-
Movies News
Athiya-Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు
-
General News
Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ
-
Politics News
Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!
-
World News
Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్ఫోర్స్లో కీలక పదవి..!
-
General News
Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని