logo

అటవీ అధికారులకు అండగా ఉంటాం

అటవీ అధికారులకు అండగా ఉంటామని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 02:26 IST

చింతూరు ఐటీడీఏ పీవోకు వినతిపత్రం ఇస్తున్న అటవీ అధికారులు

చింతూరు, న్యూస్‌టుడే: అటవీ అధికారులకు అండగా ఉంటామని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు నిరసనగా ఏపీ జూనియర్‌ అటవీ అధికారుల యూనియన్‌ ఆద్వర్యంలో శుక్రవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం పీవోకు వినతిపత్రం అందజేశారు. పీవో మాట్లాడుతూ అటవీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకుముందు చింతూరు అటవీ కార్యాయలంలో శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. చింతూరు డీఎఫ్‌వో సాయిబాబు, రేంజి అధికారి మోహని విజయలక్ష్మి, యూనియన్‌ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని