సమన్వయ లోపం.. సంకేత సంకటం
వందేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ రక్ష పథకంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ- రీ సర్వే అల్లూరి జిల్లాలో మందకొడిగా సాగుతోంది.
జిల్లాలో సాగని రీ సర్వే
పాడేరు, చింతపల్లి, న్యూస్టుడే
డి.గొందూరు పంచాయతీలో డీజీపీఎస్ సర్వే చేస్తున్న బృందం
వందేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ రక్ష పథకంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ- రీ సర్వే అల్లూరి జిల్లాలో మందకొడిగా సాగుతోంది. మొదట్లో చింతపల్లి, రంపచోడవరం మండల పరిధిలో రెండు గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా చేపట్టారు. అది విజయవంతం కావడంతో 2600 గ్రామాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెవెన్యూ సిబ్బందికి, సర్వే బృందాలకు మధ్య సమన్వయ లోపం, గిరిజన ప్రాంతంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సర్వే నత్తనడకన సాగుతోంది.
సర్వే ప్రక్రియను క్రోడీకరిస్తున్న సిబ్బంది
అడ్డంకులెన్నో..
జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డు ప్రాంతం కావడం ఆపై కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులు భూ- రీ సర్వేకు అడ్డంకులను కలిగిస్తున్నాయి. సర్వేలో కచ్చితత్వం కోసం అధునాతన ఉపగ్రహ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్)ను వినియోగిస్తున్నారు. ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సర్వేకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు వీడకపోవడం, అప్పుడప్పుడూ వర్షం కురుస్తుండటంతో పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో రోజు అంతర్జాల సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో 60 శాతానికి పైగా గ్రామాల్లో శాటిలైట్ సంకేతాలకు ప్రతికూలంగానే ఉన్నాయి. కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది, సర్వే చేపడుతున్న ఏజెన్సీల మధ్య సమన్వయ లోపం ప్రభావం సర్వేపై పడుతోంది.
బాలాజీపేట రైతుకు భూపట్టా అందిస్తున్న తహసీల్దార్
సమగ్ర సర్వే నివేదికలో పరిశీలించేవి..
* అడంగల్, భూపట్టాల మధ్య ఉన్న వ్యత్యాసం సరిచేయడం
* దీర్ఘకాలికంగా భూమి అనుభవిస్తున్న వారి పేరున ప్రస్తుతం పట్టా ఉందా, లేదో పరిశీలించడం
* పట్టాదారుడి వద్ద భూ రికార్డుల్లో ఉన్న సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా లేదో చూసి నిర్ణయించడం
* ప్రభుత్వ, ప్రైవేటు భూముల గుర్తింపు తదితర విషయాలు
గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. సర్వేపై ముందస్తు సమాచారం లేకపోవడంతో కొన్నిచోట్ల వారి వ్యవసాయ పనులకు వెళ్లిపోతున్నారు. సర్వేపై అవగాహన లేక ప్రజలు సైతం ఉత్సాహంగా ముందుకు రావడం లేదు.
చింతపల్లి మండలం బాలాజీపేట వద్ద గతంలో పనిచేసిన సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హయాంలో ప్రయోగాత్మకంగా డ్రోన్లద్వారా భూ-సర్వే చేపట్టారు. ఓ పది మందికి పట్టాలు తయారు చేశారు. పట్టా పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో సరిదిద్దేందుకు రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మండలంలో ప్రస్తుతం ఆరు గ్రామాల్లో సర్వే చేసినట్లు చెబుతున్నారు.
జిల్లా విస్తీర్ణం 12,253 చ.కి.మీ.
తొలి దశ సర్వేలో 2600 గ్రామాలు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఇటీవల ప్రకటించారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ఉండగా ముంపు గ్రామాలను మినహాయించారు.
ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఐదు బృందాల ద్వారా భూ సర్వే సమర్థంగా నిర్వహిస్తున్నాం. ప్రయోగాత్మకంగా సర్వే చేసిన రెండు గ్రామాల్లో త్వరలో 13బి పట్టాలు అందిస్తాం. డ్రోన్ పైలట్, డెస్టినేషన్ సర్వే వంటి విధానాలతో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. షెడ్యూల్డు ప్రాంతంలో మంచు త్వరగా వీడకపోవడంతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ప్రజల సహకారం మాకు మెండుగా ఉంది. అడ్డంకులను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం.
వై.మోహన్రావు, అదనపు సంచాలకులు, భూ-సర్వే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు