పచ్చకామెర్లతో ఇంటర్ విద్యార్థిని మృతి
పచ్చకామెర్లతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని సోమవారం ఉదయం పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
హారిక
పాడేరు పట్టణం, న్యూస్టుడే: పచ్చకామెర్లతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని సోమవారం ఉదయం పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఏఎన్టీ ఒకేషనల్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్న కంకిపాటి హారిక (16) ఈ నెల 21వ తేదీ నుంచి అనారోగ్యంతో బాధపడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి తమ కుమార్తెకు సెలవు మంజూరు చేయాలని సిబ్బందిని కోరారు. తామే విద్యార్థినికి పూర్తి వైద్య సేవలు అందిస్తామని, ఇంటికి పంపించమని చెప్పడంతో వారు వెనుదిరిగారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తల్లిదండ్రులు వేడుకుంటే ఈ నెల 25వ తేదీన సెలవు ఇచ్చారు. తల్లిదండ్రులు బాలికను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి పచ్చకామెర్లు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యం పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు. 21వ తేదీ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం దారుణమన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
విద్యుత్తు తీగలు తగిలి గిరిజనుడి మృతి
వై.రామవరం, న్యూస్టుడే: అటవీ ప్రాంతంలో విద్యుత్తు తీగలు తాకి ఒకరు దుర్మరణం పాలవగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వై.రామవరం మండలం బుల్లోజిపాలెం అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చారు. సింహాద్రిపాలెం గ్రామానికి చెందిన వేట్ల శ్రీరాములురెడ్డి (50), వేట్ల సంకురురెడ్డి సోమవారం పనుల నిమిత్తం అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ విద్యుత్తు తీగలను వీరు తాకడంతో శ్రీరాములురెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. సంకురురెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు. సీఐ రాంబాబు, తహసీల్దారు సుధాకర్, అదనపు ఎస్సై రాంబాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యుత్తు తీగలను అమర్చిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే