స్పందనకు 70 వినతులు
స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులన్నింటినీ పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే అధికారులను ఆదేశించారు.
పీవో గనోరేకు వినతిపత్రం అందజేసి మాట్లాడుతున్నఅటవీ అధికారులు
రంపచోడవరం, న్యూస్టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులన్నింటినీ పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఏపీవో జనరల్ శ్రీనివాసరావుతో కలసి ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై 70 మంది వినతులు అందజేశారు. మారేడుమిల్లి మండలంలోని బంద నుంచి కానివాడకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైందని, ఈ రోడ్డును పునర్నిర్మించాలని సర్పంచి పల్లాల శిల్పారాణి ఆధ్వర్యంలో గిరిజనులు వినతిపత్రం అందజేశారు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ కింటుకూరు గ్రామంలో పది పశువులను పెద్దపులి చంపేసిందని, నష్టపరిహారం చెల్లించాలని సర్పంచి కత్తుల వరలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు నర్రి పాపారావు కోరారు. పోలవరం పరిహారం చెల్లించి న్యాయం చేయాలని దేవీపట్నం మండలం సీతారం గ్రామస్థులు వినతిపత్రం అందించారు. ఈఈలు నాగేశ్వరరావు, డేవిడ్రాజు, ఎస్డీసీ వెంకటేశ్వరరావు, డీఎల్డీవో కోటేశ్వరరావు, సీడీపీవో సంధ్యారాణి, ఎంపీడీవో కుమార్బాబు తదితరులు పాల్గొన్నారు.
రేంజి అధికారి హత్య దారుణం
తెలంగాణ రాష్ట్రం చండ్రుగొండ అటవీ క్షేత్రాధికారి (రేంజర్) శ్రీనివాసరావును హత్య చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ఫారెస్టు రేంజి అధికారుల అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సునీల్కుమార్ పేర్కొన్నారు. రేంజి అధికారి హత్యను నిరసిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, కాకినాడ, రాజమహేంద్రవరం అటవీ డివిజన్ల ఉద్యోగులు సోమవారం రంపచోడవరంలో ర్యాలీ చేపట్టారు. సబ్ డీఎఫ్వో భరణి దీన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ అటవీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయుధాలను సమకూర్చినట్లయితే క్షేత్రస్థాయిలో దైర్యంగా విధులు నిర్వహించగలుగుతామన్నారు. అంతకుముందు శ్రీనివాసరావు మృతికి నివాళి అర్పించారు. ఏపీ జూనియర్ ఫారెస్టు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్కుమార్, శేఖర్బాబు, రేంజర్లు కరుణాకర్, దుర్గాకుమార్బాబు, అబ్బాయిదొర, ప్రసాద్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!