logo

నిర్వాసితులకు అండగా ఉంటాం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 01:18 IST

రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, తెదేపా నాయకులు

చింతూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట వరరామచంద్రాపురం మండలం రామవరం నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం ప్రకటించిన జాబితాలో కొందరి అర్హుల పేర్లు లేకపోవడం దారుణమన్నారు. అధికారులు సమగ్ర సర్వే చేపట్టి అర్హులందరికీ పరిహారం అందించాలన్నారు. వరరామచంద్రాపురం జడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, చింతూరు మండల తెదేపా అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి, నాయకులు ముత్యాల రామారావు, బొర్రా నరేశ్‌, మల్లెల వెంకటేశ్వరరావు, అనిగి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని