సేవల్లో వెనుకబాటు.. స్పందనలో తడబాటు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని పథకాలు, సేవల్లో పనితీరు ఆధారంగా జిల్లాలకు ర్యాంకులను కేటాయించారు.
జిల్లాల వారీగా ప్రకటించిన ర్యాంకులు ఇలా..
అల్లూరి 2, అనకాపల్లి 16, విశాఖ 21
- ఈనాడు డిజిటల్, పాడేరు, న్యూస్టుడే, పాడేరు
స్పందనలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని పథకాలు, సేవల్లో పనితీరు ఆధారంగా జిల్లాలకు ర్యాంకులను కేటాయించారు. గత ఆరునెలల్లో సచివాలయ సేవలు, స్పందన, గృహనిర్మాణం, భూ సమగ్ర సర్వేలో పురోగతిని కొలమానంగా చేసుకుని ఈ ర్యాంకులను వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ చివరి వారం వరకు సాధించిన ఫలితాల ఆధారంగా విభాగాల వారీగా పాయింట్లు కేటాయించారు. వాటన్నింటి సరాసరిలో తక్కువ పాయింట్లు సాధించిన జిల్లాలను మెరుగైన ప్రతిభ కనబర్చినట్లు, ఎక్కువ పాయింట్లు వస్తే వెనుకబడినట్లు ప్రకటించారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా మిశ్రమ ర్యాంకులను సాధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 14.31 పాయింట్లతో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో మెరిసింది.. అనకాపల్లి జిల్లా 30.95 పాయింట్లతో తడబడి 16వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక విశాఖ జిల్లా 41.60 పాయింట్లతో 21వ స్థానంతో వెనుకబడింది. జిల్లా అధికారులు మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరముందని ఈ ర్యాంకులు చెబుతున్నాయి.
వినతులకు పరిష్కారం
స్పందన కార్యక్రమంలో ఇచ్చే వినతుల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందకుంటే వాటిని పునఃపరిశీలిస్తారు. ఈ విషయంలో అల్లూరి జిల్లా 3.33 పాయింట్లతో ఉన్నతాధికారులను మెప్పించింది. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కేంద్రంలో, శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరులో స్పందన కార్యక్రమాలను కలెక్టర్ సుమిత్కుమార్ చేపడుతున్నారు. అందిన వినతులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నారు. చాలావరకు సమస్యలను ఐటీడీఏ పీఓ స్థాయిలో పరిష్కరించడంతో ఇక్కడకు వచ్చే ఫిర్యాదులు తక్కువగానే ఉంటున్నాయి. వాటిని పనఃపరిశీలన చేసే అవకాశం ఉండడం లేదు. అందువల్లే రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలవగలిగింది.
మెప్పించని సిబ్బంది పనితీరు..
* సచివాలయ సేవలకు గాను అల్లూరి జిల్లాకు 24.83 పాయింట్లు దక్కాయి. ఈ జిల్లాలో 352 సచివాలయాలున్నాయి. వీటి ద్వారా అందించాల్సిన సేవలు సంతృప్తికరంగా లేవు. సిగ్నల్స్ సమస్యలు, సిబ్బంది గైర్హాజరు వంటి కారణాలతో మెప్పించలేకపోయారు. ఈ జిల్లాలో గృహనిర్మాణం, సమగ్ర సర్వే విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అల్లూరి జిల్లాకు ర్యాంకింగ్లో కలిసివచ్చింది.
* అనకాపల్లి జిల్లాకు సచివాలయ సేవల విషయంలో 16 పాయింట్లు దక్కాయి. ఈ జిల్లాలో 465 గ్రామ, 57 వార్డు సచివాలయాలున్నాయి. వీటిని కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనితీరు బాగోలేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాకపోవడం, సిబ్బంది కార్యాలయంలో ఉండకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
* విశాఖ జిల్లాకు సచివాలయ సేవల విషయంలో 15 పాయింట్లు లభించాయి. జిల్లాలో 578 వార్డు, 54 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. కలెక్టర్ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్ తరచూ వార్డు సచివాలయాలను పరిశీలిస్తూ సిబ్బంది పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొన్నిరకాల సేవలకు కాళ్లరిగేలా తిప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సమగ్ర భూసర్వే గందరగోళం..
భూ వివాదాలకు తావులేకుండా చేయాలనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా భూములు రీసర్వే చేపడుతున్నారు. ఇందులో అనకాపల్లి 39 పాయింట్లు, విశాఖపట్నం 36 పాయింట్లు దక్కించుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో 737 గ్రామాలకు 427 చోట్ల డ్రోన్లు ఎగరవేశారు. 121 గ్రామాలకు 13 చోట్ల నోటిఫికేషన్ జారీచేశారు. విశాఖ జిల్లాలో 79 పంచాయతీల్లో 110 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్ సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం 30 శాతం గ్రామాలకే ఈ సర్వే పరిమితం అయింది.
లక్ష్యం చేరని గృహ నిర్మాణం..
ఏ లేఅవుట్ చూసినా అసంపూర్తి నిర్మాణాలే
బీ పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో అనకాపల్లి జిల్లా 74 పాయింట్లతో ఫర్వాలేదనిపిస్తే, విశాఖ జిల్లా 125 పాయింట్లతో వెనకబడిపోయింది. అనకాపల్లి జిల్లాకు 44,133 ఇళ్లు మంజూరు చేశారు. వీటిని వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. పురోగతి చూస్తే మరో ఏడాది దాటినా ఇళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్ మొదటి వారం నాటికి కేవలం 5,439 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు.
* విశాఖ జిల్లాకు మొదటి విడతగా 14,937 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 13,530 ఇళ్ల పనులు మొదలుపెట్టారు. ఈ దశలో పురోగతి పరిశీలిస్తే రాష్ట్రంలో ఒకటి రెండు స్థానాల్లో నిలిచేది. రెండో విడతగా మరో లక్ష ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 46 శాతం మొదలుపెట్టినట్లు చూపించారు. మొత్తంగా 1.14 లక్షల ఇళ్ల పురోగతిని మిగతా జిల్లాలతో సమానంగా చూడడం వల్లే ఈ ర్యాంకింగ్లో వెనుకబడినట్లు చూపిస్తోందని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. ఈ సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టినట్లు తెలిపారు.
* వినతుల పునఃపరిశీలనలో అనకాపల్లి జిల్లా 13.67 పాయింట్లు, విశాఖపట్నం జిల్లా 12.50 పాయింట్లతో కాస్త ఫర్వాలేదనిపించాయి. వచ్చిన అర్జీలను ఆయాశాఖలకు పంపిస్తుంటారు. కొన్ని తప్పుగా పంపించడం, ఫొటోలు అప్లోడ్ చేయడంలో పొరపాట్ల కారణంగా కొన్ని సమస్యలు పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.
* ఈ విషయంలో అనకాపల్లి 12.25 పాయింట్లు, విశాఖ జిల్లాకు 19.50 పాయింట్లు వచ్చాయి. దీంతో ఈ రెండు జిల్లాల అల్లూరితో పోల్చితే బాగా వెనకబడినట్లు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బోరు’మనిపించావ్ జగన్
[ 23-04-2024]
తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేశారు. -
పదోతరగతి ఫలితాల్లో జిల్లాల ర్యాంకులు కిందికి!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
జోరందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 23-04-2024]
గిరిజన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిండుగా అవకాశాలున్నా వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో అది అందని ద్రాక్షలా మారింది. -
రోడ్డు లేక ఇబ్బందులు
[ 23-04-2024]
అనంతగిరి మండలంలోని మారుముల చీడివలస, పాటిపల్లి, పట్టం, బందకొండ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సోమవారం నిరసన చేపట్టారు. -
ఓటర్లను చైతన్యపర్చండి
[ 23-04-2024]
పోలింగ్లో అధికసంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా చైతన్యపర్చాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.. భారతదేశ అంధుల క్రికెట్ జట్టు ఆల్రౌండర్ వలసినైని రవణిని కోరారు. -
కోలాహలంగా అభ్యర్థుల నామినేషన్లు
[ 23-04-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్ వేశారు. -
ప్రణాళికాలోపంతో గందరగోళం
[ 23-04-2024]
నక్కపల్లిలో సోమవారం జరిగిన ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. -
పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోండి ఇలా..
[ 23-04-2024]
పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి నాంది పలికింది. ఎ -
కూటమి జోరుతో వైకాపా నేతల్లో భయం
[ 23-04-2024]
వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. -
జనసేనలో చేరికలు
[ 23-04-2024]
ఎలమంచిలి 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సాయిప్రసన్న భర్త ఓగిబోయిన చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు. -
గిరిజనులు చింత తీరేనా?
[ 23-04-2024]
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. -
గిరి విద్యార్థుల జయకేతనం
[ 23-04-2024]
పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
[ 23-04-2024]
నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆరుగురు కీలక సభ్యులు విశాఖ రేంజి డీఐజీ విశాల్ గున్ని, అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. -
బూడి ఆస్తులు రూ.7.39 కోట్లు, అప్పులు రూ.2.54 కోట్లు
[ 23-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతోపాటుగా ఇతని భార్య రమణమ్మకు రూ.7.39 కోట్లు ఆస్తులు ఉండగా, అప్పులు రూ. 2.54 కోట్లు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్