కార్యాలయం సరే.. కార్యకలాపాలేవి?
చింతూరు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోనే ఆర్డీవో కార్యాలయాన్ని సైతం ఏర్పాటుచేశారు.
నేటి వరకు సిబ్బంది నియామకమే లేదు
నిర్మాణ దశలో చింతూరు ఆర్డీవో కార్యాలయం
చింతూరు, న్యూస్టుడే: చింతూరు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోనే ఆర్డీవో కార్యాలయాన్ని సైతం ఏర్పాటుచేశారు. నేటికీ సిబ్బందిని నియమించకపోవడంతో కార్యకలాపాలు సాగడం లేదు. సెప్టెంబరులో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతోపాటు సబ్ కలెక్టర్గా ఫర్మాన్ అహ్మద్ఖాన్ను నియమించింది. రెండు నెలలైనా సరిపడా సిబ్బంది, వసతులు లేకపోవడంతో విలీన మండలాల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు.
రాష్ట్ర విభజన తరువాత ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు. విలీన మండలాల్లో రెవెన్యూ సేవలు అందించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎటపాక కేంద్రంగా రెవెన్యూ డివిజన్, చింతూరు కేంద్రంగా ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. దీంతో ఈ మండలాల ప్రజలు రంపచోడవరం వెళ్లకుండా ఇక్కడే భూసమస్యల పరిష్కారం, ఇతర సేవలు పొందారు. వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో రంపచోడవరం నియోజకవర్గాన్ని పాడేరు కేంద్రంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చింది. ఇదే క్రమంలో ఎటపాక కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్ను రద్దు చేసింది. జులై, ఆగస్టు నెలల్లో గోదావరి, శబరి నదులకు సంభవించిన వరదల్లో విలీన మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విలీన మండలాల్లో పర్యటించిన సందర్భంగా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ఫర్మాన్ అహ్మద్ఖాన్ను సబ్ కలెక్టరుగా నియమించింది. కార్యాలయాల నిర్వహణకు సిబ్బందిని నియమించకపోడంతో ఇంకా కార్యకలాపాలు జరగడం లేదు. చింతూరులో రెవెన్యూ కార్యాలయానికి నిర్మిస్తున్న భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..